Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరు వింటే చాలు..ఆయన ఫ్యాన్స్కు పూనకాలు వస్తాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. రాజకీయాల్లో వచ్చి కొన్నాళ్ల పాటు సినీ అజ్ఞాతవాసంలో ఉన్న పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’గా టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తున్నారు.మలయాళం సూపర్ హిట్ ఫిల్మ్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్లో పవన్ కల్యాణ్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే. ‘భీమ్లా నాయక్’ టైటిల్తో వస్తున్నఈ చిత్రంలో నెగెటివ్ రోల్ దగ్గుబాటి రానా ప్లే చేస్తున్నారు.
ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, తాజాగా సెట్లో ఆఫ్ కెమెరాలో పవన్ కల్యాణ్, రానా దిగిన ఫొటో ఒకటి నెట్టింట వైరలవుతోంది. సదరు ఫొటోలో పవన్ కల్యాణ్ పట్టె మంచంపై పడుకుని ఉండగా, రానా ఎడ్ల బండి నొగలపై ఒరిగాడు. షూటింగ్లో భాగంగా సీన్లు చేసి అలసిపోయిన క్రమంలో వాళ్లు ఇలా రెస్ట్ తీసుకుంటున్నట్లు ఫొటోను చూస్తే అర్థమవుతున్నది. ఈ ఫొటోలో పవన్ కల్యాణ్ బ్లూ కలర్ షర్ట్, బూడిద రంగు లుంగీ ధరించి ఉండగా, పవన్ కల్యాణ్ షర్ట్పైన రక్తపు మరకలు కనబడుతున్నాయి.ఇక రానా వైట్ అండ్ వైట్లో మెరిసిపోతున్నారు. తెలుపు రంగు చొక్కా, లుంగీలో ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా గెటప్లో ఉన్నట్లు కనబడుతున్నాడు.
సాగర్ .కె.చంద్ర దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే , డైలాగ్స్ అందిస్తున్నారు. ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన కిన్నెర మెట్ల మొగులయ్య పాడిన ‘భీమ్లానాయక్ టైటిల్ సాంగ్’, చిత్ర పాడిన ‘అంత ఇష్టం ఏందయ్యా’ సాంగ్, టీజర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ‘భీమ్లానాయక్’ గా పవన్ కనిపించనుండగా, ఆయనకు జోడీగా నిత్యామీనన్, ‘డానియల్ శేఖర్’ పాత్ర పోషిస్తున్న రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోంది.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.