Radhe Shyam : రాధేశ్యామ్‌ విషయంలో ఫ్యాన్స్ ను గందరగోళంకు గురి చేస్తున్న మూడు విషయాలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Radhe Shyam : రాధేశ్యామ్‌ విషయంలో ఫ్యాన్స్ ను గందరగోళంకు గురి చేస్తున్న మూడు విషయాలు

Radhe Shyam : ప్రభాస్ హీరో గా పూజా హెగ్డే హీరోయిన్ గా రూపొందిన రాధేశ్యామ్‌ సినిమా విడుదలకు సిద్ధం అయింది. వచ్చే వారంలో ప్రపంచ వ్యాప్తంగా పది వేల స్క్రీన్స్ ల్లో పైగా విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన మూడు విషయాలు ప్రస్తుతం అభిమానులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా యాంటీ క్లైమాక్స్ ను కలిగి ఉంటుంది అంటూ గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. అంటే హీరో హీరోయిన్ ఇద్దరు కూడా […]

 Authored By himanshi | The Telugu News | Updated on :6 March 2022,11:00 am

Radhe Shyam : ప్రభాస్ హీరో గా పూజా హెగ్డే హీరోయిన్ గా రూపొందిన రాధేశ్యామ్‌ సినిమా విడుదలకు సిద్ధం అయింది. వచ్చే వారంలో ప్రపంచ వ్యాప్తంగా పది వేల స్క్రీన్స్ ల్లో పైగా విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన మూడు విషయాలు ప్రస్తుతం అభిమానులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా యాంటీ క్లైమాక్స్ ను కలిగి ఉంటుంది అంటూ గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. అంటే హీరో హీరోయిన్ ఇద్దరు కూడా చనిపోతారు. సినిమా చివర్లో ముగింపు చాలా విషాదకరం గా ఉంటుంది అనేది ఆ వార్తల సారాంశం.ఇటీవలే ఆ వార్తలపై దర్శకుడు రాధాకృష్ణ స్పందిస్తూ ఈ సినిమాకు అలాంటి క్లైమాక్స్‌ ఏమీ ఉండదని.

. యాంటీ క్లైమాక్స్ అనే వార్తలు నిజం కాదని క్లారిటీ ఇచ్చాడు. కచ్చితంగా ఈ సినిమా ఒక మంచి ఫీల్ తోనే ముగుస్తుంది అనే నమ్మకం కలిగిస్తూ ఆయన ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ సినిమాలో టైటానిక్ షిప్ వంటి ఒక భారీ షిప్ ని చూపించబోతున్న ట్లుగా వార్తలు వస్తున్నాయి.క్లైమాక్స్ లో ఆ షిప్‌ గురించి చాలా ఆసక్తికర విషయాలు ఉంటాయని అంటున్నారు. టైటానిక్ రేంజ్‌ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఆ స్థాయిలో షిప్పు ఉంటుందా, క్లైమాక్స్ ఉంటుందా అంటూ కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చివరగా ఈ సినిమా లో జ్యోతిష్యుడి గా ప్రభాస్ కనిపించబోతున్నాడు.

prabhas Radhe shyam movie three interesting issues

prabhas Radhe shyam movie three interesting issues

విక్రమాదిత్య అనే జ్యోతిష్యుడు ఎలా విధిని ఎదిరించే ప్రయత్నం చేశాడు అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు. కథ సహజ దూరంగా ఉంది అనిపిస్తుంది. అంటే సహజత్వానికి దూరంగా ఉంది అనిపిస్తుంది. కనుక ఈ సినిమా ఎలా ఉంటుందో అనే అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం గురించి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ మొదలయ్యు కోట్ల వసూళ్లను దక్కించుకుంటున్న ఈ సినిమా ముందు ముందు వందల కోట్లు దాటి అవకాశాలు ఉన్నాయంటూ ట్రేడ్ వర్గాల టాక్.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది