producer warns to pooja hegde
Pooja Hegde : ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్లలో ఒకరిగా ఉన్న పూజా హెగ్డే నాగ చైతన్య హీరోగా నటించిన “ఒక లైలా కోసం” సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. చాలా కొద్ది కాలంలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ లు అందుకున్న ఈ భామ ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారింది. ఒకవైపు తెలుగులో మాత్రమే కాక హిందీ లో కూడా ఈమె హవా బాగానే నడుస్తుంది.
చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్న పూజా హెగ్డేపై గత కొంత కాలంగా ఒక ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. బీస్ట్ మూవీ షూటింగ్ సమయంలో పూజా హెగ్డే స్టాఫ్కు సంబందించిన ఖర్చులు భారీగా వచ్చాయట. కేవలం వీరి ఫుడ్ కోసమే లక్షల్లో బిల్లు అయిందట. రీసెంట్గా వీటికి సంబంధించిన బిల్లులు బీస్ట్ నిర్మాతలకు అందాయట. ఇక ఆ బిల్లు చూసిన నిర్మాతలు ఒక్కసారిగా కంగుతిన్నారని వినికిడి. ఇప్పటికే బీస్ట్ మూవీ డిజాస్టర్తో భారీ నష్టాల్లో ఉన్న నిర్మాతలు పూజా, ఆమె స్టాఫ్కు అయిన ఖర్చులు మరింత భారమయ్యాయట.
producer warns to pooja hegde
అసలే నష్టాల్లో ఉన్న నిర్మాతలకు పూజ హెగ్డే మరియు ఆమె స్టాఫ్ ఖర్చులు ఇంకా భారంగా మారాయట. దాంతో నిర్మాతలు పూజా హెగ్డే చేసిన ఖర్చులు తానే కట్టుకోవాలి అంటూ బిల్లు పేపర్లను పంపి షాక్ ఇచ్చారట. గతంలో కూడా పూజా నిర్మాతలకు మరింత భారమయ్యాలే వ్యవహరిస్తుందని ఓ దర్శకుడు కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. తాను మాత్రమే కాకుండా తన స్టాఫ్ని సైతం షూటింగ్కు తీసుకువస్తుందని, వారికి అయ్యే ఖర్చు నిర్మాతలకు భారమే కదా అంటూ ఆయన వ్యాఖ్యానించాడు. మరి రానున్న రోజులలో అయిన పూజా హెగ్డే తన పంథా మార్చుకుంటుందా అనేది చూడాలి. ప్రస్తుతం పూజా హెగ్డే పవన్, మహేష్ వంటి స్టార్ హీరోల సినిమాలలో నటించనుంది.
jabardasth varsha : దాదాపు దశాబ్ద కాలంగా తెలుగు బుల్లితెరపై సత్తా చాటుతూ.. నెంబర్ వన్ కామెడీ షోగా ఓ…
One Plus 12 Phone ప్రస్తుతం అమెజాన్ లో తగ్గింపు ధరకు వన్ప్లస్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు.…
Daughter In Law : ప్రతీ కుటుంబంలో ఒకరినొకరు అర్థం చేసుకుని, మానసికంగా సమతుల్యంగా ఉంటేనే కుటుంబంలో ఆనందం, శాంతి…
Business : నిత్య జీవితంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పనిలో విసిగి పోతున్నవారికి, తమ స్వంతంగా…
Good News : త్వరలో కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఈ సంఘం ఏర్పాటుపై…
Ration : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని పాలన సాగిస్తోంది. ఇందులో…
Preity Zinta : శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్తో సంచలన విజయం సాధించింది పంజాబ్ జట్టు. ఆ విజయంతో పంజాబ్…
Hardik Pandya : ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ మెరుగ్గానే రాణించిన ఫైనల్ వరకు చేరుకోలేకపోయింది. ఆదివారం అహ్మదాబాద్…
This website uses cookies.