
Puri Jagannadh answer to chiranjeevi about auto jhonny
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి 150 సినిమాని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చేయాలనుకున్నాడు. కానీ చిరంజీవి చివరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడం జరిగింది. ఆటో జానీ అనే కథ ను చిరంజీవి కోసం పూరి జగన్నాథ్ దాదాపు రెండు సంవత్సరాల పాటు రెడీ చేశాడు. ఆ కథ ను చిరంజీవి కి పూరి జగన్నాథ్ వినిపించడం కూడా జరిగింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది అంటూ స్వయంగా చిరంజీవి అభిప్రాయం వ్యక్తం చేశాడట. సెకండ్ హాఫ్ విషయంలో కాస్త మార్పులు చేర్పులు కావాలని సూచించాడట. తప్పకుండా చేద్దాం అంటూ పూరి జగన్నాధ్ ఆ పనిలో ఉండగానే చిరంజీవి తన 150వ సినిమాను వీవీ వినాయక దర్శకత్వంలో ఖైదీ నెంబర్ 150 అంటూ అధికారికంగా ప్రకటించాడు.
పూరి జగన్నాధ్ కు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదట. ఆ విషయాన్ని పూరి జగన్నాథ్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. తన కథ బాగుంది అన్నారు.. సెకండాఫ్ రెడీ చేస్తున్న సమయంలో కనీసం నాతో చెప్పకుండా నా సినిమా ను క్యాన్సల్ చేసుకోవడం బాధను కలిగించిందని, చిరంజీవి గారితో సినిమా చేయాలని చాలా సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాను.. ఆయనతో సినిమా చేసే అవకాశం ఇప్పుడు కాకుండా మళ్లీ అయినా వస్తుంది కానీ 150 సినిమా అవకాశం చేజారటంతో తీవ్రంగా అసంతృప్తి కలిగిందంటూ పూరి జగన్నాథ్ గతంలో పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. తాజాగా గాడ్ ఫాదర్ సినిమాతో చిరంజీవి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాలో పూరి జగన్నాథ్ కనిపించాడు. దాంతో ఇద్దరి మధ్య విభేదాలు దాదాపుగా తొలగిపోయినట్లే అంటూ అంతా భావించారు.
Puri Jagannadh answer to chiranjeevi about auto jhonny
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పూరి జగన్నాథ్ ఇంకా తన మనసులో చిరంజీవిపై కోపం పెంచుకున్నట్లుగానే అనిపిస్తుంది. ఇటీవల గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ అయిన నేపథ్యం లో పూరి జగన్నాథ్ కి ఒక ఇంటర్వ్యూను చిరంజీవి ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో నా ఆటో జానీ కథ ఏమైంది అంటూ చిరంజీవి ప్రశ్నించిన సమయంలో అంతకు మించిన మంచి కథ రెడీ చేస్తున్నాను అన్నట్లుగా ఆటో జానీ కథను మీకు ఇచ్చేది లేదు అంటూ చిరంజీవికి చెప్పకనే చెప్పాడు. అప్పుడు ఆటో జానీ కథ ను తిరస్కరించినందుకు గాను ఇప్పుడు ఇంటర్వ్యూలో చిరంజీవికి కౌంటర్ ఇచ్చి ఆటో జానీ కథ గురించి మర్చి పోవాలని పూరి జగన్నాథ్ చెప్పాడు అంటూ ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ విషయమై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.
Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…
Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…
Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…
Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…
Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…
Maruti Mini Brezza 2026 Review : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి Maruti Suzuki మరోసారి మార్కెట్లో…
Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్.…
AP Budget 2026-27 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రూ. 3,32,205 కోట్ల…
This website uses cookies.