Rajamouli : రాజ‌మౌళి ఆస్తుల గురించి తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవ‌ల్సిందే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rajamouli : రాజ‌మౌళి ఆస్తుల గురించి తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవ‌ల్సిందే..!

 Authored By sandeep | The Telugu News | Updated on :27 June 2022,9:00 pm

Rajamouli : బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ ద‌క్కించుకున్న డైరెక్ట‌ర్ రాజ‌మౌళి. ర‌చ‌యిత విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ కుమారుడిగా రాజ‌మౌళి ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ తండ్రిని మించిన‌ త‌న‌యుడు అనిపించుకున్నారు. మ‌రోవైపు రాజ‌మౌళి చేసిన సినిమాలన్నింటికీ ఆయ‌న తండ్రి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ‌ల‌ను రాయ‌డం గొప్ప‌విష‌యం. రాఘ‌వేంద్ర‌రావు శిష్యుడిగా ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టిన రాజ‌మౌళి మొద‌ట‌ శాంతినివాసం అనే సీరియ‌న్ ను తెరకెక్కించారు. స్టూడెంట్ నెం 1 తో ఇండస్ట్రీలోకి దర్శకుడిగా అడుగు పెట్టి..ఆ తరువాత మగధీర సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ లెక్కలు మర్చేసిన ది వన్ అండ్ ఓన్లీ జక్కన్న.ఓట‌మెరుగ‌ని విక్ర‌మార్కుడిలా వ‌రుస విజ‌యాలు అంద‌కుంటూ నెం1 స్థాయిలో నిలిచారు రాజ‌మౌళి.

రీసెంట్ గా జ‌క్క‌న్న ఆర్ఆర్ఆర్ సినిమాతో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ను అందుకున్నారు. ఇక రాజ‌మౌళి భార్య ర‌మా రాజ‌మౌళి కూడా డిజైన‌ర్ గా ప‌ని చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా రాజ‌మౌళి కుమార‌డు కార్తికేయ కూడా జ‌క్కన్న సినిమాల‌కు పనిచేస్తుంటారు. ఇదిలా ఉంటే రాజ‌మౌళికి ఫుల్ క్రేజ్ ఉండ‌టంతో ఆయ‌న త‌న సినిమాల‌కు భారీ రెమ్యున‌రేషన్ ను పుచ్చుకుంటున్నారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కూ రాజ‌మౌళికి రూ.148 కోట్ల ఆస్తులు ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఆయన ఎలా లేదన్న సినిమా 60 నుండి 70 కోట్లకు పైగానే పారితోషకం పుచ్చుకుంటాడు అన్న టాక్ ఉంది. మరి అలాంటి ఆయన పేరు మీద ఇంత తక్కువ వాల్యూ ప్రాపర్టీస్ ఉండటం ఇండస్ట్రీలో కొత్త డౌట్లు పుట్టిస్తుంది.

rajamouli property cost news viral

rajamouli property cost news viral

Rajamouli : ఆశ్చ‌ర్య‌పోయే విష‌యం..

మహేశ్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కించే సినిమాపై అందరూ దృష్టి సారించారు. దీంతో ముందు నుంచే దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి. దాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ మూవీ స్టోరీపి తయారు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఈ ప్రాజెక్టు స్క్రిప్ట్ బాధ్యతను జక్కన్న ఇప్పటికే తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు అప్పగించినట్లు స్వయంగా వెల్లడించాడు. నిజానికి మహేశ్ బాబు.. ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా గత ఏడాది చివర్లోనే మొదలవుతుందని అంతా అనుకున్నారు. కానీ, కరోనా కారణంగా ఆర్ఆర్ఆర్ వాయిదా పడడంతో ఈ ప్రాజెక్టు కూడా ఆలస్యం అయింది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు కూడా త్రివిక్రమ్‌తో సినిమాను చేస్తున్నాడు. అంటే అది పూర్తయ్యాకే ఈ సినిమా ప్రారంభం కాబోతుందని తేలిపోయింది.

sandeep

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి