Mahesh Rajamouli : 50 కోట్ల బ‌డ్జెట్ వార‌ణాసి సెట్‌.. మ‌హేష్ సినిమా కోసం రీక్రియేట్ చేస్తున్న రాజ‌మౌళి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mahesh Rajamouli : 50 కోట్ల బ‌డ్జెట్ వార‌ణాసి సెట్‌.. మ‌హేష్ సినిమా కోసం రీక్రియేట్ చేస్తున్న రాజ‌మౌళి..!

 Authored By ramu | The Telugu News | Updated on :19 June 2025,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Mahesh Rajamouli : 50 కోట్ల బ‌డ్జెట్ వార‌ణాసి సెట్‌.. మ‌హేష్ సినిమా కోసం రీక్రియేట్ చేస్తున్న రాజ‌మౌళి..!

Mahesh Rajamouli : ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్. రాజ‌మౌళికి ఆర్థిక వ‌న‌రుల ప‌రంగా ఎలాంటి స‌మ‌స్యా లేదు. ఆయ‌న త‌న సినిమా కోసం భారీ సెట్స్ నిర్మిస్తున్నార‌ట‌. మ‌హేష్ కథానాయ‌కుడిగా అత‌డు రూపొందిస్తున్న ఫారెస్ట్ అడ్వెంచ‌ర్ మూవీ- ఎస్.ఎస్.ఎం.బి 29 కోసం 50 కోట్ల బ‌డ్జెట్ తో వార‌ణాసి సెట్ నిర్మిస్తున్నార‌ని తెలిసింది.

Mahesh Rajamouli 50 కోట్ల బ‌డ్జెట్ వార‌ణాసి సెట్‌ మ‌హేష్ సినిమా కోసం రీక్రియేట్ చేస్తున్న రాజ‌మౌళి

Mahesh Rajamouli : 50 కోట్ల బ‌డ్జెట్ వార‌ణాసి సెట్‌.. మ‌హేష్ సినిమా కోసం రీక్రియేట్ చేస్తున్న రాజ‌మౌళి..!

Mahesh Rajamouli భ‌లే ప్లాన్..

నిజానికి గంగా న‌ది ఒడ్డున‌ రియ‌ల్ లొకేష‌న్ల‌లో ఇలాంటి భారీ చిత్రాన్ని తెర‌కెక్కించాలంటే అది స‌వాల్ తో కూడుకున్న‌ది. పోలీసుల నుంచి అనుమ‌తులు పొంద‌డం అంత సులువు కాదు. దాంతో పాటు, ప్ర‌జ‌ల నుంచి చాలా ఇబ్బందులు త‌లెత్తుతాయి.అందుకే రాజ‌మౌళి వార‌ణాసిని త‌ల‌పించే ఓ భారీ సెట్ ని నిర్మించాల‌ని ప్లాన్ చేసిన‌ట్టు తెలిసింది. వార‌ణాసి అంటే దేవాల‌యాలు, ఘాట్‌లతో ఆధ్యాత్మిక‌త నిండిన ప్ర‌దేశం.

అలాంటి మ‌రో న‌గ‌రాన్ని నిర్మించాల‌నే ఆలోచ‌న స‌వాళ్లతో కూడుకున్న‌ది. ఒరిజినాలిటీ చెడ‌కుండా దానిని చూపించాలి. దీనికోసం ఆర్ట్ డైరెక్ట‌ర్ స‌మ‌క్షంలో రాజ‌మౌళి ప‌ని చేస్తున్నార‌ని తెలిసింది. అడ‌విలో ప‌ర్వ‌తాల‌లో సంజీవ‌ని వ‌న‌మూలిక‌ను వెత‌క‌డానికి వెళ్లిన హ‌నుమంతుడి స్ఫూర్తితో ఈ క‌థ‌ను రూపొందించార‌ని టాక్ వినిపిస్తోంది. దాదాపు వెయ్యి కోట్ల బ‌డ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కథానాయిక‌. పృథ్వీరాజ్ సుకుమార‌న్ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నాడు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది