Rajendra Prasad : ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద విజయం సాధించిన చిత్రం ఎఫ్ 3. వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలలో అనీల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాకి మంచి టాక్ లభించింది. ఈ చిత్రం సక్సెస్ ఫుల్గా రన్ అవుతుండటంతో చిత్రయూనిట్ గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేసింది. ఫన్ రైడ్ సెలెబ్రేషన్స్ అంటూ ఈవెంట్ నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ను యాంకర్ మంజూష నడిపించింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్ ఎంట్రీ వెరైటీగా జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన మాటలు వినిపించి చూపించారు. సినిమా హిట్ అవ్వకపోతే మీ ఎవ్వరికీ నా మొహం చూపించను అని నాడు రాజేంద్ర ప్రసాద్ అన్న మాటలను వీడియోలో ప్లే చేయించి చూపించారు.
అయితే స్టేజ్ మీదకు రాజేంద్ర ప్రసాద్ను యాంకర్ మంజూష పిలిచేసింది. వెనుక మాటలు వినిపిస్తుంటే.. రాజేంద్ర ప్రసాద్ మొహానికి మాస్క్ లాంటిది వేసుకుని వచ్చాడు. సర్ మాస్క్ తీసేయండి అని మంజూష అనేసింది. దీంతో రాజేంద్ర ప్రసాద్ అసహనానికి గురయ్యాడు. ఉండవమ్మా.. నీ గోల.. ఇక్కడ మా గోలే ఎక్కువైందంటే.. మధ్యలో నీ గోల ఏంటి అని అనడంతో యాంకర్ మంజూష పక్కకు వెళ్లిపోయింది. అయితే తాను అలా మాస్క్ వేసుకుని రావడం వెనుకున్న కారణాన్ని చెప్పాడు.
సినిమా హిట్ అవ్వకపోతే తన మొహాన్ని ఎవ్వరికీ చూపించనని అన్నాను.. కానీ ఇప్పుడు చూపిస్తున్నానంటూ దానర్థం ఏంటి.. సినిమా హిట్ అని చెప్పేశాడు. సోమవారం కూడా థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయంటే సినిమా హిట్ కాక ఇంకేం అవుతుందని రాజేంద్ర ప్రసాద్ అన్నాడు. మంజూష విషయానికి వస్తే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్తో కలిసి రాఖీ చిత్రం ద్వారా మంజూష సినీ రంగంలోకి అడుగుపెట్టింది. రాఖీ చిత్రంలో ఎన్టీఆర్కు చెల్లెలుగా నటించి తన నటనతో అందర్నీ మెప్పించింది. అయితే అవకాశాలు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో యాంకరింగ్పై దృష్టిపెట్టింది. యాంకర్గా అవకాశాలు తలుపుతట్టడంతో స్టార్ యాంకర్గా మారింది.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.