
Rashmi Gautam : మహేష్ బాబు అడిగితే చేయాలా..? యాంకర్ రష్మి గౌతమ్ షాకింగ్ కామెంట్స్..!
Rashmi Gautam : రీసెంట్ గా వచ్చిన మహేష్ బాబు ‘ గుంటూరు కారం ‘ సినిమాలోని కుర్చీ మడత పెట్టి సాంగ్ ఫుల్ వైరల్ అయింది.రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే ఈ పాట మారుమ్రోగిపోతుంది. కుర్చీ మడత పెట్టి డైలాగ్ ను వాడిన షేక్ పాషా అనే కుర్చీ తాత కూడా బాగా పాపులర్ అయ్యారు. ఆ కుర్చీ తాత డైలాగుతో ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చారు. దాంతో ఆయన బాగానే సంపాదించారు కూడా. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ పాటకి ఫుల్ క్రేజ్ ఏర్పడింది. అయితే ఈ పాట మీద చాలా కాంట్రవర్సీలు వచ్చాయి. దాన్ని కొట్టి పడేస్తూ సెలబ్రిటీ దాని గురించి ట్వీట్ వేశారు. గుంటూరు కారం సినిమాలోని కూర్చి మడతపెట్టి సాంగ్ లో శ్రీ లీల డాన్స్ ఎంత హైలైట్ అయిందో పూర్ణ డాన్స్ కూడా అంతే హైలెట్ అయింది.
అయితే సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. పూర్ణ వేసిన ఆ డాన్స్ బిట్ కోసం ముందుగా యాంకర్ రష్మీ గౌతమ్ ని సినీ మేకర్స్ అడిగారట. అయితే అందుకు రష్మీ ఒప్పుకోలేదు. దీంతో ఆ సాంగ్ కి పూర్ణని తీసుకున్నారు అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై తాజాగా రష్మీ గౌతమ్ స్పందించారు. ఈ పాట కోసం నన్ను ఎవరు అప్రోచ్ అవ్వలేదని, ఎందుకు ఇలాంటి ఫేక్ వార్తలు రాస్తారు అంటూ ఆమె ట్విట్టర్లో ట్వీట్ చేశారు. నన్ను అసలు ఎవరూ అడగలేదని, నేను ఎలా రిజెక్ట్ చేస్తాను అని, పూర్ణ చేసిన బిట్స్ అద్భుతంగా ఉన్నాయని, ఆమె కన్నా అంత గ్రేస్ ఫుల్ గా ఎవరూ చేయలేరని, ఇలాంటి వార్తలు వలన నాపై నెగిటివిటీ పెరుగుతుందని, దయచేసి ఇలాంటి వార్తలు నమ్మవద్దు అని రష్మీ ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
ఇలా రష్మీ తనపై వస్తున్న తప్పుడు వార్తలు పై స్పందించారు. ఇకపోతే రష్మీ ప్రస్తుతం జబర్దస్త్ యాంకర్ గా చేస్తున్నారు. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి కూడా ఆమె యాంకర్ గా కొనసాగుతున్నారు. ఇక సినిమాలలో రష్మీ నటించట్లేదుగా తెలుస్తుంది. ఆ మధ్య అడపా దడపా సినిమాలలో కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు సినిమాలలో కనిపించడం లేదు. మంచి పాత్ర వస్తే చేస్తానని ఆమె చెబుతున్నారు. ఇక రష్మి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. తనకు సంబంధించిన ఫోటోలను తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు తనపై వస్తున్న తప్పుడు వార్తలు పై కూడా స్పందిస్తూ ఉంటారు. తనపై వచ్చిన ఫేక్ న్యూస్ పై వెంటనే ఖండిస్తుంటారు. ఇక తాజాగా మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. తనపై వస్తున్న తప్పుడు వార్తలు పుల్ స్టాప్ పెట్టారు. ఇలా తప్పుడు వార్తలు వలన సెలబ్రిటీలపై నెగెటివిటీ పెరిగే అవకాశం ఉంటుంది.
Virosh Jodi : తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ఆదరణ పొందిన జంటగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ –…
Vivo X200 Pro : ప్రీమియం ఫీచర్లు, సూపర్ కెమెరా క్వాలిటీ, బలమైన పనితీరు అన్నీ కలిపి స్మార్ట్ఫోన్ను తక్కువ…
Vijay : తమిళ సినీ నటుడు, టీవీకే (తమిళగా వెట్రి కళగం) అధినేత విజయ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన…
TTD Jobs : నిరుద్యోగ వైద్య అభ్యర్థులకు శుభవార్త. తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడీ) అనుబంధ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న…
గల్ఫ్ ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ప్రపంచ దేశాలన్నింటికీ ఒక పెద్ద హెచ్చరికలా కనిపిస్తున్నాయి. ఇరాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య…
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని మరియు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరు…
తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒక పెద్ద మార్పు గురించి జోరుగా చర్చ జరుగుతోంది. దాదాపు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ…
PMSBY : ఈ రోజుల్లో ఒక కప్పు టీ తాగాలన్నా కనీసం 20 రూపాయలు ఖర్చవుతోంది. అయితే అదే 20…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ నడుస్తోంది, అదే జగన్ అరెస్ట్ వ్యవహారం. గత ఐదేళ్ల పాలనలో…
womens : మహిళల సాధికారతను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను అమలు చేస్తోంది. రాష్ట్రంలోని…
USA Target : అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న గొడవలు చూస్తుంటే అసలు వాళ్ళ అసలు ఉద్దేశం ఏంటనేది పెద్ద ప్రశ్నగా…
Free Gas Cylinder Scheme : రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కలిగించేందుకు అమలులో ఉన్న దీపం పథకం…
This website uses cookies.