Renu Desai : రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో మరీ అంత యాక్టివ్గా ఏమీ ఉండదు. అవసరం మేరకు స్పందిస్తుంటుంది. ఆమె చేసే పోస్టులన్నీ కూడా వైరల్ అవుతుంటాయి. రేణూ దేశాయ్ ఎక్కువగా పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి అంటూ ఇలాంటి సహజ పోస్టులే చేస్తుంటుంది. లేదంటే తన బిడ్డల గురించి చెబుతూ పోస్టులు వేస్తుంది. ఆద్య అల్లరి, అకీరా నందన్ టాలెంట్కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తుంటుంది. అలా రేణూ దేశాయ్ నిత్యం ఏదో ఒక పోస్ట్ వేస్తుంటుంది. అయితే కరోనా సమయంలో రేణూ దేశాయ్ ఎంతో మందికి సాయం చేసింది. ఎన్నో స్వచ్చంద సంస్థలతో కలిసి పని చేసింది.
థర్డ్ వేవ్ సమయంలో మాత్రం రేణూ దేశాయ్ సోషల్ మీడియా ప్రపంచానికి దూరంగా ఉంటూ వచ్చింది. కరోనాతో తన కుటుంబం అంతా కూడా బాధపడింది. అలా రేణూ దేశాయ్ కొన్ని రోజులు షూటింగ్లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అయితే తాజాగా రేణూ దేశాయ్ ఓ పోస్ట్ వేసింది. అందులో ఓ సర్వే గురించి సంచలన నిజాలు చెప్పింది. సన్ స్క్రీన్ వాడే వారు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారట. అమెరికాలో ఈ సర్వే జరిగినట్టు.. అక్కడ ఇలాంటి బాధితులే ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై రేణూ దేశాయ్ స్పందించింది. ఇంత వరకు నా జీవితంలో నేను ఒక్కసారిగా కూడా అవి వాడలేదు..
అంతే కాదు అకీరా, ఆద్యలను కూడా నేను వాడనివ్వను.. ఫ్యాషన్ ట్రెండ్లను గుడ్డిగా ఫాలో అవ్వడం ఆపండి అంటూ రేణూ దేశాయ్ అందరినీ హెచ్చరించింది. మొత్తానికి సన్ స్క్రీన్లు, లోషన్లు అంటూ ఇప్పటి యువత ఎంతలా వాడేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొత్తానికి రేణూ దేశాయ్ మాత్రం వాటికి దూరంగానే ఉంటుందట. రేణూ దేశాయ్ మళ్లీ నటిగా బిజీ అవుతోంది. ఆల్రెడీ ఆద్య అనే వెబ్ సిరీస్ రన్నింగ్లో ఉంది. అది ఎంత వరకు వచ్చిందో తెలియడం లేదు. కానీ రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రేణూ దేశాయ్ మళ్లీ సిల్వర్ స్క్రీన్ మీద రీఎంట్రీ ఇవ్వబోతోంది.
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లో రోజులు గడుస్తున్నా కొద్దీ టాస్కులు టఫ్…
Tirumala Laddu Prasadam : కలియువ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పుణ్యక్షేత్రానికి చాలా విశిష్తత ఉంది.…
Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
This website uses cookies.