renu desai : కరోనా సెకండ్ వేవ్ తో మళ్ళీ దాదాపు మూడు నాలుగు నెలలు అన్నీ మూతపడిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ విధించడంతో షూటింగ్స్ ఆగిపోయాయి. థియేటర్స్ మూతపడి సినిమా రిలీజ్ లు కూడా ఆగిపోయాయి. దాంతో కొందరు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటే రేణు దేశాయ్ లాంటి వారు మాత్రం రెండు మూడు నెలలుగా సోషల్ మీడియాకి దూరంగా ఉన్నారు. అంతక ముందు చాలా యాక్టివ్ గా ఉన్న ఆమె పలు వ్యక్తిగత విషయాలతో పాటు ఆమె పాల్గొంటున్న షోలకి సంబంధించి, సినిమాలకి సంబంధించిన అప్డేట్స్ అనీ ఇక్కడ ఇస్తూ వస్తున్నారు. అంతేకాదు కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న సమయంలో సోషల్ మీడియా ద్వారా ఎంతో మందికి సహాయం కూడా చేశారు. కొన్ని స్వచ్చంద సంస్థలతో కలిసి రేణు దేశాయ్ చాలామంది ఆకలిని తీర్చారు.
అయితే ఒక్కసారిగా ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోయేసరికి ఆమె అభిమానులు ఇకపై ట్విట్టర్, ఇన్స్టా వంటి వాటిలో కనిపించరేమో అని ఫీలయ్యారు. తాజాగా వారికి ఓ పోస్ట్ పెట్టి సర్ప్రైజ్ ఇచ్చారు రేణు దేశాయ్. సెకండ్ వేవ్ ప్రభావం చాలా తీవ్రం ఉండటంతో బయటి పరిస్థితులు దారుణంగా మారాయి. అందుకే ఇంట్లోనే ఉండిపోయాను. బయట షూటింగ్లకు కూడా వెళ్లలేదు. చాలా భయంగా అనిపించింది. ముఖ్యంగా ఇంట్లో పిల్లలు ఉన్నారు. వారిని రిస్క్ లో పడేయాలనుకోలేదు. అందుకే డ్రామా జూనియర్స్ షోకు కూడా వెళ్లడం లేదు అని రేణు దేశాయ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
ఇక తాజాగా రేణు దేశాయ్ renu desai మళ్ళీ బయటకి వచ్చారు. అత్యంత సన్నిహితుల ఇంట్లో పెళ్లి ఉండటంతో హాజరయ్యారు. ఈ విషయాన్ని ఆమె తెలుపుతూ ఓ పోస్ట్ చేశారు. “చాలా రోజుల తరువాత ఇలా బయటకు వచ్చాను.. పెళ్లికి వచ్చాను.. ఇప్పుడు మాస్క్ ధరించడం జనజీవనంలో సాధారణంగా మారిపోయింది. ఇకపై మనం మాస్క్ లేకుండా నిజంగానే కంఫర్ట్గా ఉంటామా? అని ఆశ్చర్యం వేసింది.” అని రేణు దేశాయ్ ట్వీట్ లో రాసుకొచ్చారు. ఇదే సందర్భంలో ఆమె చేస్తున్న రైతు సినిమా గురించి మాట్లాడుతూ.. “మళ్లీ వచ్చే వేసవి వరకు ఆగాల్సిందేనని, ఆ సమయంలోనే షూటింగ్ చేయాల్సి ఉంటుంది.” అని రేణు దేశాయ్ లైవ్లో వెల్లడించారు.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.