Vijayendra prasad : ఆర్ఆర్ఆర్ రైటర్ వి విజయేంద్ర ప్రసాద్..అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి గతంలో ఆయన రాసిన ఓ ఇండస్ట్రీ హిట్ సినిమాకి సీక్వెల్ కథ రాస్తున్నట్టు టాప్ సీక్రెట్ ను రివీల్ చేశారు. తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమా బాహుబలి సీక్వెల్స్. అలాంటి సినిమాకి కథ అందించడంతో పాటు బాలీవుడ్, కోలీవుడ్లో పాన్ ఇండియన్ కథలను అందించి తన సత్తా ప్రపంచవ్యాప్తంగా చాటుకున్న విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రాం చరణ్ – యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోలుగా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రానికి కథ అందించారు. భారీ మల్టీస్టారర్గా ఆయన తనయుడు..దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.
విజయేంద్ర ప్రసాద్ ఒక కథ పూర్తి కాగానే మరో కథ సిద్దం చేసే పనిలో ఉంటారు. ఆయన కూడా దర్శకత్వం చేసినప్పటికి కథ రాయడమే సులభంగా భావిస్తుంటారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు తమిళ, హిందీ, తెలుగులో రూపొందుతున్న అమ్మ జయలలిత బయోపిక్ సినిమాకి కథ అందించారు. ఆమె సినీ, రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన అంశాలే కాకుండా వ్యక్తిగత విషయాలను కథలో విజయేంద్ర ప్రసాద్ ప్రస్తావించారట. ఇలా ఒకే ఏడాది ఓ బయోపిక్, ఇద్దరు పోరాట యోధుల కథలను అందించిన ఘనత ఆయనకి దక్కింది.
ఈ నేపథ్యంలో మరిన్ని కథలను సిద్దం చేస్తున్నట్టు ఇటీవల విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. అందులో ఒకటి ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోయే పాన్ ఇండియా సినిమాకి కథ కాగా మరొకటి గతంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన భజరంగీ భాయ్ జాన్ సినిమాకి సీక్వెల్ కథ కావడం విశేషం.
ఈ సినిమాను సల్మాన్ ఖాన్తో పాటు రాక్ లైన్ వెంకటేశ్ 90 కోట్లతో నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 900 కోట్లకి పైగా వసూళ్ళు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ కథ సిద్దం చేస్తున్నారట. విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే పాయింట్ సల్మాన్కి చెప్పినట్టు ఆయన నచ్చి పూర్తి స్థాయిలో కథ సిద్దం చేయమని అన్నట్టు చెప్పుకొచ్చారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.