Sai Dharam Tej Pawan Kalyan multi starrer update on this month
Pawan Kalyan : ప్రస్తుతం టాలీవుడ్లో మల్టీ స్టారర్ హంగామా నడుస్తుంది. చిన్న హీరోలతో పాటు పెద్ద హీరోలు అలానే పెద్ద హీరోలు కలిసి భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో మల్టీ స్టారర్ రూపొందనుందంటూ ప్రచారం నడుస్తుంది. ఇటీవల తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని నటించి దర్శకత్వం వహించిన తాజా చిత్రం వినోదయ సితం తెలుగులో రీమేక్ కానుందని అంటున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించనున్నట్లు సమాచారం. అంతేకాదు ఇదే సినిమాలో మరో ప్రధాన పాత్రలో మెగామేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటించనున్నాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పవన్ కళ్యాణ్ తన సొంత బ్యానర్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్పై నిర్మించనుండగా, తీనికి సముద్రఖని దర్శకత్వం వహించనున్నారనే ప్రచారం నడుస్తుంది. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా, ఎప్పుడు అఫీషియల్ ప్రకటన వస్తుందా అని అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమం మార్చి 25న జరగనున్నట్టు తెలుస్తుంది. అప్పుడే సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు కూడా వెల్లడించనున్నారట. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక ప్రైవేట్ కంపెనీలో జనరల్ మేనేజర్గా పనిచేసే ఓ వ్యక్తి ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోతారు.
Sai Dharam Tej Pawan Kalyan multi starrer update on this month
చనిపోయిన వ్యక్తి ఆత్మను తీసుకెళ్ళడానికి దేవుడు రావడం.. ఆ చనిపోయిన వ్యక్తి తాను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని చెప్పి.. కొంత సమయం కావాలంటూ అడగడంతో.. దేవుడు మూడు నెలల సమయాన్ని చనిపోయిన వ్యక్తి కి ఇస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ. ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీలో చాలా మంది హీరోలు ఉన్నప్పటికీ మల్టీస్టారర్ సినిమాలు రావడానికి చాలా సమయం పడుతుంది. అంచనాల స్థాయి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సరైన కథ సెట్ అయితే గాని అలాంటి ప్రాజెక్టులో సెట్స్ పైకి రావని చెప్పవచ్చు. ఇక త్వరలోనే ఈ మెగా మల్టీస్టారర్ కు శ్రీకారం చుట్టనున్నారని సమాచారం.
Pakistani : పహల్గాం ఉగ్రదాడి తర్వాత Pak - India భారత్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతున్న తరుణంలో…
బాలీవుడ్ నటి అమీషా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'కహో నా ప్యార్ హై' చిత్రంతో రాత్రికి రాత్రే…
Rashmi Gautam Sudheer : బుల్లితెర క్రేజీ జంటలలో సుధీర్-రష్మీ గౌతమ్ జంట ఒకటి. వీరిద్దరూ కలిసి బుల్లితెరపై కనిపిస్తే…
Prabha Heroine : సోషల్ మీడియా వేదికగా సినీ నటులు, అభిమానులతో నిత్యం ఇంటరాక్షన్ జరుపుతూ ఉంటారు. ఈ క్రమంలో…
Caste Survey : తొలిసారిగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల కుల గణన చేపట్టనున్నారు. ఇప్పటి వరకు ఎస్సీ…
Anil Kumar Yadav : నెల్లూరు జిల్లాలో మైనింగ్ మూసివేతపై మాజీ మంత్రి, వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్…
Feeding Cows : హిందూ సంస్కృతిలో ఆవులకు ఆహారం పెట్టడం లోతైన ఆధ్యాత్మిక మరియు జ్యోతిషశాస్త్ర ప్రాముఖ్యతను కలిగి ఉంది.…
Jio : ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్ నెట్ మొబైల్ లేకుండా ఉండేవారు చాలా తక్కువే అని చెప్పాలి. జియో…
This website uses cookies.