Samantha : అందాల ముద్దుగుమ్మ సమంత ప్రస్తుతం లేడి ఓరియెంటెడ్ సినిమాలే ఎక్కువగా చేస్తుంది. ఆమె నటించిన శాకుంతలం చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా నిర్మాత నీలిమ గుణ పలు ఇంటర్వ్యూలలో సమంత గురించి ఆసక్తికర విషయాలు తెలియజేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఆ మధ్య చై సామ్ విడాకులపై స్పందించింది. సమంత పిల్లల్ని కనేందుకు అంతా సిద్ధం చేసుకుంది కానీ ఆగస్టులో ఏదో జరిగి విడాకులు తీసుకున్నారు. “శాకుంతలం సినిమా కోసం మా నాన్న (దర్శకుడు గుణశేఖర్) సమంత ని సంప్రదించారు. అప్పటికే ఆమె సినిమాలు చేయకూడదని ఫ్యామిలీ ప్లానింగ్ లో ఉన్నానని అందుకే సినిమా చేయనని చెప్పారు.
కథ నచ్చడంతో ఓకే చెప్పారు ఆగస్టు కల్లా షూటింగ్ పూర్తి చేయాలని ఆమె కోరారు. మేము కూడా షూటింగ్ అలానే ప్లాన్ చేసాము. సమంతా సినిమాలకి విరామం ఇచ్చి పిల్లల్ని కనేందుకే ప్రాధాన్యత ఇచ్చారు అని ఆ మధ్య నీలిమ గుణ చెప్పుకొచ్చింది. ఇక తాజా ఇంటర్వ్యూలో సమంత మహిళకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరిందని ఆమె చెప్పినట్టు మేం చేశామని అన్నారు. సినిమా స్టార్ట్ చేయక ముందు సమంత చిత్రం కోసం ఎక్కువ మంది మహిళలను తీసుకోవాలని కోరింది. ఆమె ఆలోచన మాకు కూడాబాగా నచ్చింది.సమంత చెప్పినట్టుగానే సినిమా కోసం ఎక్కువ మంది టెక్నీషియన్స్ని తీసుకున్నాం. శాకుతలం కోసం చాలా మంది మహిళలే పని చేశారు అంటూ నీలిమ రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
అయితే నీలిమ ఇంటర్వ్యూ పేపర్ కటింగ్ని సమంత తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. గార్ల్ పవర్ అని కామెంట్ పెట్టింది. గుణశేఖర్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ ప్యాన్ ఇండియన్ చిత్రం మహాభారత గాథలోని ఆదిపర్వం నందు గల శకుంతల దుష్యంత మహారాజు ప్రేమ కథ ఆధారంగా రూపొందుతోంది. ఈ రమణీయ ప్రేమకావ్యంలో సమంతకు జోడీగా ‘దుష్యంతుడి’ పాత్రలో మలయాళీ నటుడు దేవ్ మోహన్ నటించారు. ఇక ఈ సినిమాలో మరో విశేషం ఏమంటే అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఈ సినిమాతో బాలనటిగా తెరంగేట్రం చేయనున్నారు.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.