Samantha : అందాల ముద్దుగుమ్మ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. చూడచక్కని అందం, ఆకట్టుకునే అభినయం ముద్దుగుమ్మ సొంతం.ఇటీవల సమంత రేంజ్ మాములుగా లేదు. రీసెంట్గా సమంత రోల్స్ రాయిస్ లో రాణిలా దిగింది. క్వీన్ ఎలిజబెత్ ని తలపించింది. అలా కాస్ట్ లీ కార్ నుంచి స్టైలిష్ గా దిగిన సామ్ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఫోటోగ్రాఫర్ల ముందు ఫోజులిచ్చింది. తన కళ్లకు బ్లాక్ కలర్ గాగుల్స్ ధరించి రెబల్ క్వీన్ నే తలపించింది. ప్రస్తుతం సమంత ముంబై చుట్టూనే తిరుగుతోంది.
అక్కడి పరిశ్రమపై కన్నేసింది. జెట్ స్పీడ్ తో తాను వెళ్లే మార్గంలోనే బిగ్ కెరీర్ ఆశిస్తోంది. బాలీవుడ్ బడా దర్శక, నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్గా చేస్తోన్న కార్యక్రమమే ‘కాఫీ విత్ కరణ్’. ఇప్పటి వరకు అత్యధికంగా బాలీవుడ్ హీరోహీరోయిన్లు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు నుండి బాహుబలి టీం తప్ప మరెవరూ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. అయితే తాజాగా సమంత దీనికి సంబంధించిన షూట్లో పాల్గొందని బాలీవుడ్ మీడియా కోడైకూస్తోంది. ఇప్పటి వరకు ఈ కార్యక్రమం ఆరు సీజన్లు కాగా, ఏడో సీజన్ త్వరలో ప్రారంభం కానున్నట్లు సమాచారం.
కాగా, ఈ కార్యక్రమం ఓటీటీలో ప్రసారం కానున్నట్లు గతంలో కరణ్ వెల్లడించారు. అయితే కరణ్ షోలో పాల్గొన్న సమంత తన విడాకుల విషయంపై నోరు విప్పిందనే టాక్ ఒకటి నడుస్తుంది. ఈ షోలో చాలా కాంట్రవర్షియల్ విషయాలు బయటకు వస్తుంటాయి. ఈ క్రమంలోనే సమంత విడాకుల విషయం గురించి చర్చ నడించిందని టాక్. ఇటు సమంత సైతం బాలీవుడ్లో పాగా వేసేందుకు ఈ ప్రోగ్రామ్లో పాల్గన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె నటించిన శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి కాగా, యశోద, ఖుషిలో చేస్తున్నారు.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.