Samantha : సమంత కన్నీళ్లను ఫుల్ గా వాడేసుకుంటున్న ‘శాకుంతలం’ టీమ్‌..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :19 January 2023,3:40 pm

Samantha : సమంత అనారోగ్యం కారణంతో గత కొన్నాళ్లుగా సినిమాల షూటింగ్ లతో పాటు ప్రమోషన్ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. పూర్తిగా బెడ్‌ కే పరిమితమైన సమంత ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. వచ్చే నెల నుండి షూటింగ్ లకు హాజరు కాబోతున్నట్లుగా ఆమె నటిస్తున్న చిత్ర యూనిట్ సభ్యులకు సమాచారం అందించిందట. ఇదే సమయంలో సమంత నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధం కాబోతుంది. వచ్చే నెల 17వ తారీఖున విడుదల కాబోతున్న శాకుంతలం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల కోసం సమంత కాస్త ఎక్కువగానే కష్టపడబోతున్నట్లుగా తెలుస్తోంది.

నార్త్ తో పాటు సౌత్‌ లోని అన్ని రాష్ట్రాల్లో కూడా సమంతతో ప్రచారం చేయించేందుకు గాను గుణశేఖర్ టీం వర్క్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ముఖ్యంగా సమంత అనారోగ్య సమస్యను జనాల ముందుకు తీసుకు రావడం ద్వారా సినిమాకు ఎక్కువగా ప్రమోషన్ చేయాలని వారు భావిస్తున్నారట. ట్రైలర్ రిలీజ్ సమయంలో సమంత కన్నీళ్లు పెట్టుకోవడంతో అనూహ్యంగా పబ్లిసిటీ దక్కింది. భారీ ఎత్తున పబ్లిసిటీ రావాలి అంటే ఒకటి రెండు సార్లు అయినా సమంత కన్నీళ్లు పెట్టుకోవాలంటూ శాకుంతలం చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. సమంత పబ్లిసిటీ కార్యక్రమాల్లో పాల్గొంటే కచ్చితంగా ఆమె అనారోగ్య సమస్యల గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది,

shakuntalam team using samantha tears for movie promotions

shakuntalam team using samantha tears for movie promotions

అప్పుడు ఆమె కన్నీళ్లు పెట్టుకునే విజువల్స్ మీడియాకు చిక్కుతాయి. దాంతో శాకుంతలం సినిమా ప్రెస్ మీట్ లో కన్నీళ్లు పెట్టుకున్న సమంత అంటూ పదే పదే స్క్రోలింగ్ వస్తుంది. అలా శాకుంతలం సినిమాకు మంచి పబ్లిసిటీ లభించినట్లు అవుతుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గుణశేఖర్ టీం మెంబెర్స్ మాత్రం ఈ విషయాన్ని కొట్టి పారేస్తున్నారు. సమంత తమ సినిమా యొక్క పబ్లిసిటీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఒప్పుకున్నారు, అంతే తప్ప ఆమెను ఎమోషనల్‌ గా వాడుకోవాల్సిన అవసరం శాకుంతలం టీం కి లేదని, కచ్చితంగా సినిమా సూపర్ హిట్ అవుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి