SS Rajamouli is planning movie with Mahesh Babu
SS Rajamouli : ఓటమెరుగని విక్రమార్కుడు రాజమౌళి బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ప్రమోషనల్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబుతో మరో భారీ బడ్జెట్ చిత్రం చేయనున్నరు. ఈ సినిమాపై గత కొద్ది రోజులుగా అనేక వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల్లో జరిగే థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనుందని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ హింట్ ఇచ్చారు. ఇక ఈ సినిమా సెట్స్పైకి కూడా వెళ్లక ముందే మహేష్-రాజమౌళి చిత్రంపై రకరకాల వార్తలు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈ సినిమాలో మరో సీనియర్ హీరో నటించనున్నారని వార్తలు వచ్చాయి. మొదట విక్రమ్ అని తర్వాత బాలకృష్ణ అనే చర్చ జరిగింది.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి తప్పుడు ప్రచారాలు ఖండించారు. ఈ వార్తల్లో నిజం లేదని, మహేశ్తో తీయబోయే మూవీలో సోలో హీరో ఉంటాడని జక్కన్న క్లారిటీ ఇచ్చాడు. ఇక తాజాగా ఈ ప్రాజెక్ట్ విషయం గురించి ప్రముఖ సినీ విమర్శకుడు భరద్వాజ్ రంగన్ తో మాట్లాడుతూ, మహేష్ బాబుతో తన తదుపరి గురించి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మహేష్ బాబు తో సినిమా, బాహుబలి మరియు ఆర్ఆర్ఆర్ కన్నా పెద్దదిగా ఉండబోతోందని అన్నారు.
SS Rajamouli is planning movie with Mahesh Babu
రాజమౌళి చేసిన ఈ ప్రకటన వైరల్గా మారింది. దీంతో అభిమానులు మరిన్ని అంచనాలు పెంచేసుకుంటున్నారు.ప్రస్తుతం మహేష్ బాబు .. ‘సర్కారు వారి పాట’ సినిమా ఆల్మొస్ట్ కంప్లీట్ కావొచ్చింది. ఈ నెలాఖరుతో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. ఏప్రిల్ నుంచి త్రివిక్రమ్ మూవీ షూటింగ్లో మహేష్ బాబు పాల్గొననున్నారు. ఈ సినిమాను దసరా వరకు కంప్లీట్ చేసి వచ్చే డిసెంబర్ కానీ సంక్రాంతికి గానీ ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు మహేష్ బాబు. ఆ తర్వాత మహేష్ బాబు .. రాజమౌళి సినిమా కోసం డెడికేటెడ్ గా వర్క్ చేయనున్నారు.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.