Rajamouli : ఓటమి అనేది లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు రాజమౌళి. ఆయన ఏ సినిమా చేసిన కూడా అది బాక్సాఫీస్ని షేక్ చేయాల్సిందే. ఇటీవల ట్రిపుల్ ఆర్ సినిమాతో బాక్సాఫీస్ని షేక్ చేసిన రాజమౌళి త్వరలో మహేష్ బాబుతో సినిమా చేసేందుకు సన్నద్దమవుతున్నాడు. అయితే ఆర్ఆర్ఆర్ చిత్రం ఏకంగా ఆస్కార్ బరిలో నిలవడం, ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా సినిమా అభిమానులు, సినీ వర్గాలు స్పందించి ప్రశంసలు కురిపిండంతో రాజమౌళి పేరు కూడా తెగ మారుమ్రోగిపో యింది. ఆర్ఆర్ఆర్ చిత్రం జపాన్లోనూ విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రమోషన్ కోసం అని జపాన్ వెళ్లారు.
ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్ సినిమా కోసం కొద్ది రోజులుగా పని చేస్తున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ రేంజ్లో అంతర్జాతీయ స్థాయిలో యాక్షన్ అడ్వెంచరస్గా ఈ సినిమాని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు . ఆఫ్రీకా అడవుల బ్యాక్ డ్రాప్లో కథ ఉంటుందని రైటర్ విజయేంద్రప్రసాద్ కూడా చెప్పారు. తాజాగా ఈ కథ నిజ జీవితం ఆధారంగా రాసుకున్నదని తెలిపారు. రిలీజ్ లైఫ్ ఇన్స్ డెంట్స్ ఆధారంగా సాగే కథ అని చెప్పారు. ఈ కథకి మహేష్ అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతాడని భావించి అతనిని ఎంపిక చేసుకున్నారట. ప్రస్తుతం తాను రాజమౌళి కలిసి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నామని, అది పూర్తవడానికి ఇంకాస్త టైమ్ పడుతుందన్నారు. మహేష్ బాబు కెరీర్లోనే ఈ చిత్రం అతిపెద్ద ప్రాజెక్ట్ అవుతుందని, బడ్జెట్ వైజ్గానూ భారీగా ఉండబోతుందని చెప్పారు.
రాజమౌళి- మహేష్ బాబు సినిమాని వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. విజయేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం మహేష్బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో `SSMB28` చిత్రంలో నటిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ సిని పూర్తైన వెంటనే రాజమౌళి సినిమా స్టార్ కానుంది. ఇదిలా ఉంటే ఇందులో విలన్ పాత్రల కోసం ఇద్దరు స్టార్ హీరోలను తీసుకోబోతున్నారట జక్కన్న. తమిళ హీరో కార్తి, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.