T20 WORLD CUP టీ20 ప్రపంచకప్ -2021 సెమీఫైనల్స్ మ్యాచ్లో దాయాది పాక్ జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడంతో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ తెగ సంబురాలు చేసుకుంటున్నారు. మనకు దక్కనిది దాయాదా పాక్ జట్టుకు ఎందుకు దక్కాలి. మనం ఓడిపోయాం.. పర్లేదు.. తర్వాత చూసుకుంటాం.. కానీ ఇప్పుడు ఒకవేళ పాక్ జట్టు గెలిస్తే వాళ్లు మాములుగా బిల్డప్ ఇవ్వరు అని ఇండియన్స్ ఫ్యాన్స్ అంటున్నారు. అంతేకాకుండా ఇండియాలోనూ కొందరు పాక్ సానుభూతి పరులు ఎక్కడో ఓ చోట ఉంటున్నారు.
ఇండియాపై పాక్ ఎప్పుడు మ్యాచ్ గెలిచినా వారు టపాసులు పేలుస్తూ వీధుల్లోకి వచ్చి నానా హంగామా చేస్తుంటారు. దీనిని నికార్సైన భారతీయులు ఎవరూ జీర్ణించుకోలేదు.నిన్న జరిగిన మ్యాచులో పాకిస్తాన్ జట్టు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 177 పరుగులు చేసింది. పాక్ జట్టు విధించిన టార్గెట్ ఛేదనే లక్ష్యంగా బరిలోకి దిగిన కంగారు ఆటగాళ్లు మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించారు. మ్యాచ్ చివర్లో స్టోయినిస్, వేడ్ చేలరేగి ఆడగా 19వ ఓవరల్లోనే టార్గెట్ ఛేదించి ఆసిస్ విజయాన్ని సొంతం చేసుకుని ఫైనల్స్కు చేరింది.
దీంతో పాక్ జట్టు ఆటగాళ్లు నిరాశకు లోనయ్యారు. మరోవైపు పాక్ అభిమానులు కూడా ఆ జట్టు ఆటగాళ్లను ఓ రేంజ్లో టార్గెట్ చేసి మరి విమర్శలు గుప్పిస్తున్నారు.టీ20 వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి పాక్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అక్టోబర్ 24 జరిగిన ఇండియాతో జరిగిన తొలి మ్యాచ్లో పాక్ ఓపెనర్లు ఇద్దరే చెలరేగి ఆడి పాక్ విజయాలకు రెడ్ కార్పెట్ పరిచారు.
అయితే, ఇప్పటివరకు జరిగిన అన్ని వరల్డ్ కప్ టోర్నీల్లో పాక్ ఇండియాపై ఎప్పుడు గెలవలేదు. తొలిసారి విరాట్ సేనపై పాక్ గెలవడంతో పాక్ అభిమానులతో పాటు, ఇండియాలోని కొందరు ఫుల్లు సెలబ్రేట్ చేసుకున్నారు. సెమీస్ లో పాక్ ఓడిపోవడంతో మా రీవెంజ్ ఆస్ట్రేలియా వాళ్లు తీర్చారని, పాక్ కు కప్పు రాకుండా చేశారని ఫుల్ మాస్ డ్యాన్సులు వేస్తూ ఎంజాయ్ చేశారట.. పాక్ ఇప్పటికి కూడా మౌకా మౌకా అని ఎదరుచూడాల్సిందేనని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.