tollywood heroines who have ruined their careers
Heroines : తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్లకు గ్లామర్తో పాటు నటనా, చమత్కారం, కొన్ని సార్లు దూకుడుతో పాటు తగ్గడం కూడా తెలిసి ఉండాలి. అప్పుడే వారికి వరుసగా ఆఫర్లు వస్తుంటాయి. లేకపోతే వారికి కెరీర్ నీటి బుడగ లాగా పేలిపోతుంది. వీటన్నింటి కంటే సక్సెట్ రేటు ఎంతో ముఖ్యం. అందుకోసం మంచి కథలను ఎంపిక చేసుకునేంత స్కిల్ కూడా ఉండాలి. కెరీర్ ఆరంభంలో మంచి విజయాలు అందుకున్న హీరోయిన్లు కొందరు ఆ తర్వాత బ్యాడ్ స్క్రిప్టులు ఎంచుకుని చాలా మంది తమ కెరీర్ను పాడు చేసుకున్నారు. వీరిలో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..అనిత హస్సానందిని ఉదయ్ కిరణ్కు జోడిగా ‘నువ్వు నేను’ సినిమాలో చేసింది. ఈ సినిమా భారీ హిట్ అందుకుంది. ఆ తర్వాత ఆమె శ్రీరామ్, తొట్టిగ్యాంగ్ లాంటి పసలేని కథలు చేసి క్రమంగా ఇండస్ట్రీకి దూరమైంది.
బాలీవుడ్ నటి నేహా శర్మ ‘చిరుత’ చిత్రంతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కుర్రాడు వంటి సోసో స్టోరీలను ఎంచుకుని తను కూడా కనుమరుగైంది. హీరోయిన్ రక్షిత ‘ఇడియట్’ మూవీతో మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత నిజం, ఆంధ్రావాలా పసలేని కథలను ఎంచుకుని తన కెరీర్ను పాడు చేసుకుంది. మధ్యలో శివమణి చిత్రంలో నటించినా అందులో ఆమె కంటే ఆసిన్కు మంచి పేరు వచ్చింది.నటి ఇషా చావ్లా ‘ప్రేమ కావాలి’సినిమాతో తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈ అమ్మడు చేసిన మూవీస్ అన్ని డిజాస్టర్ అయ్యాయి. నటి కార్తీక తెలుగులో నాగ చైతన్యకు జోడిగా ‘జోష్’మూవీలో కనిపించింది. తమిళంలో ‘రంగం’చిత్రం మాత్రం అ బ్యూటీకి మంచి హిట్ ఇచ్చింది.
tollywood heroines who have ruined their careers
సీనియర్ నటి రాధ కూతురు కార్తీకకు ఇండస్ట్రీ రెడ్ కార్పెట్ పరువలేకపోయింది. అను ఇమ్మాన్యుయేల్ నేచురల్ స్టార్ నానికి జోడిగా ‘మజ్ను’చిత్రంతో నటించి మంచి సక్సెస్ ను అందుకుంది. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఆమెకు పెద్దగా పేరును తీసుకు రాలేకపోయాయి. యంగ్ హీరోయిన్ నందిత రాజ్ ‘ప్రేమ కథా చిత్రం’ చిత్రంలో మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత పెద్దగా సినిమా ఆఫర్లు రాలేదు. బో… బ్యూటీ హెబ్బా పటేల్ ‘కుమారి 21 ఎఫ్’చిత్రంతో సూపర్ విక్టరీ అందుకున్నా తర్వాత సినిమాలు బోల్తా కొట్టాయి. కృతి శెట్టి ‘ఉప్పెన’ మూవీతో మంచి విజయాన్ని అందుకున్నా.. ‘శ్యామ్ సింగ రాయ్’లో మాత్రం లిమిటెడ్ రోల్. క్రెడిట్ మొత్తం సాయి పల్లవికి వెళ్లిపోయింది. బంగార్రాజు మూవీ హిట్ టాక్ తెచ్చుకున్నా పెద్దగా రాలేదు.
Eating 2 Apples : ప్రతిరోజు కనీసం ఒకటి లేదా రెండు ఆపిల్ అయినా తినాలని డాక్టర్స్ సిఫారసు చేస్తూనే…
Surveyor Tejeshwar : తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.…
SAI KORRAPATI : బళ్లారి, జూన్ 24 : శరణుజొచ్చినవారిని అభయమిచ్చి కాపాడే బళ్లారి అమృతేశ్వరాలయంలో గత మహాశివరాత్రి పర్వదినం…
Energy Drinks : కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి ఇలాంటి డ్రింక్స్ ని అలవాటు చేస్తున్నారు. పిల్లలు అలసిపోయి వస్తే వారికి…
YSRCP TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న…
Reheat Food : సాధారణంగా చాలామంది చేసే పొరపాటు వండిన ఆహారాన్ని మరలా వేడి చేస్తూ ఉండడం. ఇలా చేస్తే…
Telangana : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఊహించని రాజకీయ సంక్షోభం పొంచి ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.…
LIC Recruitment 2025 : ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ 250 మంది అప్రెంటిస్ల నియామకాన్ని ప్రకటించింది. ఈ మొత్తం ఖాళీల్లో…
This website uses cookies.