Tollywood Ticket : ఇన్నాళ్ళూ టికెట్ రేట్లే సర్వ నాశనం చేసాయి..!
Tollywood Ticket తెలుగు రాష్ట్రాల్లో గత రెండు నెలలుగా థియేటర్లు కళకళలాడుతున్నాయి. టికెట్ ధరలు అందుబాటులో ఉండటంతో ప్రేక్షకుల ఆదరణ పెరిగిందా? తాజా బాక్సాఫీస్ ట్రెండ్పై ఆసక్తికర చర్చ.
Tollywood Ticket : గత రెండు నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు సందడిగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీకెండ్ వచ్చిందంటే చాలు.. చాలా సినిమాలకు హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. సినిమా టాక్ యునానిమస్గా లేకపోయినా, కేవలం ‘పర్లేదు’ అనే స్థాయిలో ఉన్నా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏపీ, తెలంగాణలో కొంతకాలంగా టికెట్ రేట్ల పెంపు విషయంలో పెద్దగా హడావుడి లేకపోవడమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు ఎనిమిది వారాలకు పైగా బాక్సాఫీస్ వద్ద టికెట్ ధరల పెంపు అంశం పెద్దగా కనిపించలేదు. చివరిసారిగా భారీ స్థాయిలో టికెట్ రేట్లను పెంచుకున్న పెద్ద సినిమా రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ మాత్రమే. ఆ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా హైక్ కోసం ప్రయత్నించకపోవడం ప్రేక్షకులకు కలిసొచ్చిందనే టాక్ వినిపిస్తోంది.ప్రస్తుతం అమల్లో ఉన్న టికెట్ రేట్లను ఇలాగే కొనసాగించాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారని సినిమా వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత కొంతకాలంగా కనిపిస్తున్న కలెక్షన్ల ట్రెండ్ను పరిశీలిస్తే కూడా ఈ అభిప్రాయానికి బలం చేకూరుతోందని అంటున్నారు.‘కొరియన్ కనకరాజు’, ‘చెన్నై లవ్ స్టోరీ’, ‘లెనిన్’, ‘మా ఇంటి బంగారం’ వంటి సినిమాలు మంచి విజయాలు సాధించడంతో పాటు.. ‘నాగబంధం’ లాంటి సినిమాలు కూడా తమ స్థాయిలో వసూళ్లు రాబట్టినట్లు చెబుతున్నారు. సినిమా టాక్ ఎలా ఉన్నప్పటికీ ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి అందుబాటులో ఉన్న టికెట్ ధరలు ఒక కారణంగా మారుతున్నాయనే విశ్లేషణలు ఉన్నాయి.
Tollywood Ticket : ఇన్నాళ్ళూ టికెట్ రేట్లే సర్వ నాశనం చేసాయి..!
Tollywood Ticket టికెట్ ధరలు అందుబాటులో ఉండటంతో ప్రేక్షకుల ఆసక్తి
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ విధానం సానుకూల ప్రభావం చూపుతోందని చెబుతున్నారు. అక్కడ మల్టీప్లెక్స్లలో గరిష్ఠ టికెట్ ధర రూ.177గా ఉండటం కూడా ప్రేక్షకులకు అందుబాటులో ఉండే అంశంగా మారింది. భారీగా ధరలు పెంచకుండా సినిమాలను అందుబాటులో ఉంచితే థియేటర్కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హాలీవుడ్ సినిమాల విషయంలోనూ ఇదే తరహా పరిస్థితి కనిపించిందని చెబుతున్నారు. ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’, ‘ది ఒడిస్సి’ వంటి హాలీవుడ్ చిత్రాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు సాధించాయి. డబ్బింగ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు టికెట్ ధరల్లో పెద్దగా పెంపులు లేకపోవడం బయ్యర్లకు కూడా ప్రయోజనకరంగా మారిందనే అభిప్రాయాలు ఉన్నాయి. టికెట్ రేట్లు అందుబాటులో ఉంటే ఒక ప్రేక్షకుడు ఒక సినిమాకే పరిమితం కాకుండా రెండు లేదా మూడు సినిమాలను కూడా థియేటర్లలో చూసే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఒక్క సినిమా నిర్మాతకే కాకుండా ఇతర సినిమాల నిర్మాతలకు కూడా ప్రయోజనం కలుగుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
Tollywood Ticket ఒక సినిమా బదులు రెండు సినిమాలు చూస్తున్న ప్రేక్షకులు?
సినిమా టాక్ యావరేజ్గా ఉన్నా.. టికెట్ ధరలు కాస్త అందుబాటులో ఉంటే ప్రేక్షకుల సంఖ్య పెరిగి, సినిమా బ్రేక్ ఈవెన్ దాటే అవకాశం ఉంటుందని ఇటీవల కలెక్షన్ల ట్రెండ్ సూచిస్తోందని విశ్లేషణలు చెబుతున్నాయి. అందుకే పాన్ ఇండియా సినిమాలు చేసే నిర్మాతలు మినహా.. మిగిలిన నిర్మాతలు టికెట్ ధరల అంశాన్ని మరింత సీరియస్గా పరిశీలించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గతంలో సంక్రాంతి సీజన్ను కారణంగా చూపిస్తూ ‘అనగనగా ఒక రాజు’ సినిమాకు ఏపీలో రూ.50 వరకు టికెట్ హైక్ తీసుకున్న సందర్భాలు జనవరిలో చోటుచేసుకున్నాయి. ఇలాంటి పెంపుల వల్ల ప్రేక్షకులపై అదనపు భారం పడే అవకాశం ఉంటుందని సినీ అభిమానులు అంటున్నారు. ఇక రాబోయే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, ‘మకుటం’, ‘అగద’, ‘పళ్ళబురుసు’ వంటి సినిమాలకు కూడా అందుబాటులో ఉండే టికెట్ ధరల వ్యూహం ఉపయోగపడే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మరోవైపు ‘టాక్సిక్’, ‘ప్యారడైజ్’ వంటి సినిమాల విషయంలో టికెట్ ధరలపై పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆయా చిత్రాలకు వచ్చే టాక్, మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉండొచ్చని భావిస్తున్నారు.మొత్తంగా చూస్తే.. టికెట్ ధరలు ప్రేక్షకులకు అందుబాటులో ఉంటే థియేటర్లకు జనాలు వస్తారు, సినిమా యావరేజ్గా ఉన్నా వసూళ్లు రాబట్టే అవకాశం ఉంటుంది అనే విషయం ఇటీవలి బాక్సాఫీస్ ట్రెండ్ మరోసారి చర్చకు తెచ్చింది. ఇకపై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఈ అంశాన్ని ఎలా పరిగణలోకి తీసుకుంటారో చూడాలి.







