Trisha : త్రిష‌కి కోప‌మొచ్చింది.. న‌య‌న‌తార‌కి అంత వార్నింగ్ ఇచ్చిందా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Trisha : త్రిష‌కి కోప‌మొచ్చింది.. న‌య‌న‌తార‌కి అంత వార్నింగ్ ఇచ్చిందా..?

 Authored By ramu | The Telugu News | Updated on :13 April 2025,9:00 am

ప్రధానాంశాలు:

  •  Trisha : త్రిష‌కి కోప‌మొచ్చింది.. న‌య‌న‌తార‌కి అంత వార్నింగ్ ఇచ్చిందా..?

Trisha : టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో న‌య‌న‌తార‌,త్రిష త‌ప్పక ఉంటారు. త్రిష కోలీవుడ్‌లో అడుగుపెట్టి 20 ఏళ్లు దాటిపోయింది. ఇప్పటికీ బిజీ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ఇక తాజాగా త్రిష, అజిత్ కలిసి గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో నటించారు. సినిమాకు అజిత్ అభిమానుల నుంచి భారీ ఆదరణ లభిస్తుండటంతో చిత్రబృందం సంతోషంగా ఉంది. కానీ ఈ సినిమా విడుదల తర్వాత నటి త్రిష మాత్రం చాలా కోపంగా ఉందట.

Trisha త్రిష‌కి కోప‌మొచ్చింది న‌య‌న‌తార‌కి అంత వార్నింగ్ ఇచ్చిందా

Trisha : త్రిష‌కి కోప‌మొచ్చింది.. న‌య‌న‌తార‌కి అంత వార్నింగ్ ఇచ్చిందా..?

Trisha త్రిష సీరియస్…

లేడీ సూపర్ స్టార్ అంటే ఒక్క త్రిష మాత్రమేనని కొంద‌ర కామెంట్స్ చేయ‌డంతో, దీనిపై నయనతార అభిమానులకు కోపం వచ్చింది. ఇన్ని సంవత్సరాల నుంచి సినిమాలు చేస్తున్నప్పటికీ కనీసం డబ్బింగ్ చెప్పడం కూడా రాదని, వేరేవారిపై ఆధారపడుతుందని, ఆమె నటన కూడా బాగోదంటూ నయనతార అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఈ గొడవపై త్రిషకు కోపం వచ్చింది. నయనతార అభిమానులను లక్ష్యంగా పెట్టుకొని ఓ పోస్ట్ చేసింది.

‘ఛా.. టాక్సిక్ మనుషుల్లారా… మీకెలా నిద్ర పడుతుందో? సోషల్ మీడియాలో ఉండి తెలివి తక్కువగా మనుషులు మీరు. ఇతరుల గురించి పోస్ట్‌లు పెట్టడమే మీ పనా? మీకోసం, మీతో జీవించేవారి కోసం చాలా బాధపడుతున్నాను. ఇది పిరికితనం. గాడ్ బ్లెస్ యూ’ అని పోస్ట్ చేసింది. హేటర్స్‌కు కౌంటర్ ఇవ్వడానికే ఆమె ఈ పోస్ట్ పెట్టింది. ఇరు వర్గాల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో గొడవ జ‌రుగుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది