Home » Entertainment » Trivikram Drowned Chiranjeevi For Mahesh Babu
Entertainment

Mahesh Babu : చిరంజీవికి పెద్ద దెబ్బ వేసిన త్రివిక్రమ్ .. ఇదంతా మహేష్ బాబు కోసమే ..!!

Authored By
aruna
The Telugu News | Updated on: May 4, 2025 6:20 pm
Advertisement

Mahesh Babu : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చిరంజీవికి పెద్ద దెబ్బ వేశారట. మెగాస్టార్ చిరంజీవి 2005లో ‘ జై చిరంజీవ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ నిర్మించారు. అలాగే విజయభాస్కర్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో భూమిక, సమీరా రెడ్డి హీరోయిన్ లుగా నటించారు. అయితే ఈ సినిమాలో సరైన కథాబలం లేక దమ్మున్న రచన లేకపోవడంతో అట్టర్ ప్లాప్ గా నిలిచింది. అయితే ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన, మాటల సహకారం అందించారు. అంతకుముందు

Advertisement

Trivikram drowned chiranjeevi for Mahesh Babu

త్రివిక్రమ్ విజయభాస్కర్ కాంబినేషన్లో మన్మధుడు, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.ఆ నమ్మకంతోనే విజయభాస్కర్ త్రివిక్రమ్ ని పెట్టుకున్నారు. కానీ త్రివిక్రమ్ అదే సమయంలో మహేష్ బాబుతో ‘ అతడు ‘ సినిమాను తెరకెక్కించాడు. మహేష్ బాబు తో ఛాన్స్ రావడంతో త్రివిక్రమ్ చిరంజీవి సినిమాపై పెద్దగా పట్టించుకోలేదు. అందుకే కథలో దమ్ము లేకపోయిందని మాటలు కూడా సరిగా రాలేదని విజయభాస్కర్ పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు. అలా త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమా కోసం డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలని అందుకే చిరంజీవి సినిమాను అంతగా పట్టించుకోలేదని విజయభాస్కర్ ఆరోపణ చేశారు.

Advertisement

జై చిరంజీవ సినిమా డిజాస్టర్ అవడంతో విజయభాస్కర్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయారు. క్రమక్రమంగా ఆయన ఇండస్ట్రీకి దూరమయ్యారు. కానీ త్రివిక్రమ్ మాత్రం స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. టాలీవుడ్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబి 28 సినిమాను తెరకెక్కి స్తున్నాడు. అయితే మహేష్ బాబు కోసం త్రివిక్రమ్ చిరంజీవి సినిమా ను పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తుంది. మొత్తానికి త్రివిక్రమ్ చిరంజీవికి పెద్ద దెబ్బ వేశాడు అంటూ జనాలు కామెంట్లు చేస్తున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి