Mahesh Babu : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చిరంజీవికి పెద్ద దెబ్బ వేశారట. మెగాస్టార్ చిరంజీవి 2005లో ‘ జై చిరంజీవ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ నిర్మించారు. అలాగే విజయభాస్కర్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో భూమిక, సమీరా రెడ్డి హీరోయిన్ లుగా నటించారు. అయితే ఈ సినిమాలో సరైన కథాబలం లేక దమ్మున్న రచన లేకపోవడంతో అట్టర్ ప్లాప్ గా నిలిచింది. అయితే ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన, మాటల సహకారం అందించారు. అంతకుముందు
త్రివిక్రమ్ విజయభాస్కర్ కాంబినేషన్లో మన్మధుడు, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.ఆ నమ్మకంతోనే విజయభాస్కర్ త్రివిక్రమ్ ని పెట్టుకున్నారు. కానీ త్రివిక్రమ్ అదే సమయంలో మహేష్ బాబుతో ‘ అతడు ‘ సినిమాను తెరకెక్కించాడు. మహేష్ బాబు తో ఛాన్స్ రావడంతో త్రివిక్రమ్ చిరంజీవి సినిమాపై పెద్దగా పట్టించుకోలేదు. అందుకే కథలో దమ్ము లేకపోయిందని మాటలు కూడా సరిగా రాలేదని విజయభాస్కర్ పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు. అలా త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమా కోసం డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలని అందుకే చిరంజీవి సినిమాను అంతగా పట్టించుకోలేదని విజయభాస్కర్ ఆరోపణ చేశారు.
జై చిరంజీవ సినిమా డిజాస్టర్ అవడంతో విజయభాస్కర్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయారు. క్రమక్రమంగా ఆయన ఇండస్ట్రీకి దూరమయ్యారు. కానీ త్రివిక్రమ్ మాత్రం స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. టాలీవుడ్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబి 28 సినిమాను తెరకెక్కి స్తున్నాడు. అయితే మహేష్ బాబు కోసం త్రివిక్రమ్ చిరంజీవి సినిమా ను పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తుంది. మొత్తానికి త్రివిక్రమ్ చిరంజీవికి పెద్ద దెబ్బ వేశాడు అంటూ జనాలు కామెంట్లు చేస్తున్నారు.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.