Venu Swamy: సెలబ్రిటీలు, రాజకీయాల జీవితాలకు సంబంధించి ఏవో పిచ్చి జాతకాలు చెబుతూ వార్తలలో నిలుస్తుంటాడు వేణు స్వామి. సమంత, నాగ చైతన్య విడిపోతారని చెప్పడం అది నిజం కావడంతో మనోడు తెగ పాపులర్ అయ్యాడు. ఇక అప్పటి నుండి తన నోటికి వచ్చినవి ఏవో చెబుతూ వస్తున్నాడు. 2014 సమయంలో అనుకుంటాను.. కృష్ణ, విజయ నిర్మలగారి జాతకాలు చూసి, 2020లో మీ ఇద్దరిలో ఒకరు చనిపోతారని చెప్పాను. ఇద్దరిలో ఒకరు చనిపోతారని ఎప్పుడైతే ఓపెన్గా చెప్పానో అప్పటి నుంచి నన్ను దూరం పెట్టారు అని అన్నాడు. ఇక పవన్ కళ్యాణ్, శ్రీజ జాతకాలు ఒకటేనని, వారిద్దరి జాతకాల్లో కుజుడు నీచంలో ఉన్నాడని వేణు స్వామి అన్నారు.
పవన్కి నాలుగో పెళ్లి కూడా జరుగుతుందని, అలాగే శ్రీజ కూడా నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటుందని సంచలన వ్యాఖ్యలు చేసి మెగా అభిమానులతో చీవాట్లు తిన్నాడు. వైవాహిక జీవితంలో లేడీ సూపర్ స్టార్ నయనతార, జేజమ్మ అనుష్క, నేషనల్ క్రష్ రష్మిక మందన్న, అందాల ముద్దుగుమ్మ విజయం సాధించలేరని తెలిపారు. వీరిలో గురువు నీచంలో ఉన్నారని తెలిపారు. దీని వల్లనే వీరికి సంసార సుఖం ఉండదని తెలిపారు. అందుకే సమంతకు అలా జరిగిందని అంటున్నారు. ప్రభాస్కు కూడా గురువు నీచంలో ఉన్నారని తెలిపారు. దీంతో ఆయన సంసార జీవితం సరిగా ఉండదని తెలిపారు .ఇక కర్ణాటక రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున రష్మిక ఎంపీగా పోటీ చేయనుందని వేణు స్వామి చెప్పారు. ఆమె జాతకంలో అలా రాసిపెట్టి ఉందని అన్నారు. ఇక తాజాగా మరో పెద్ద బాంబ్ పేల్చారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా హీరోయిన్గా ఉన్న ఇద్దరు వ్యక్తులు త్వరలోనే చనిపోతారు అంటూ షాకిచ్చారు.
దీంతో ఈ మ్యాటర్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది . కాగా వేణుస్వామి వ్యాఖ్యలపై సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు స్పందించారు. సమంత నాగచైతన్య.. వాళ్ళది పర్సనల్ మ్యాటర్.. అసలు ఈ విషయం ఆయనకు అనవసరం లేదు.. వారి వ్యక్తిగత జీవితంలోకి తలదూర్చడానికి నువ్వు ఎవరు.. అంతేకాదు ఎవరోలో ఇండస్ట్రీలో ఏదో అవుతుంది అంటూన్నావ్ అది కరెక్టేనా” అంటూ ఆయన మాటలను తప్పుపట్టారు . ఇటీవల పాన్ ఇండియా స్టార్గా మారి భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్న ఓ హీరో, ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న టాప్ హీరోయిన్ త్వరలో చనిపోతారని వేణు స్వామి చెప్పాడు. దీంతో ఆయనని ఏకి పారేశారు ఇమ్మంది రామారావు. మార్కెట్లో తన స్ట్రాటజీ పెంచుకోవడానికే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఈ మాటలను నమ్మద్దని.. ఈ వ్యాఖ్యలు తప్పు” అంటూ ఇబ్బంది రామారావు అభిప్రాయపడ్డాడు .
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.