
what is ys jagan next plan on three capitals in ap
YS Jagan : ప్రస్తుతం ఏపీ రాజకీయాలు మూడు రాజధానుల చుట్టే తిరుగుతున్నాయి. ఎందుకంటే.. ఓవైపు ఒకటే రాజధాని ముద్దు.. అదే అమరావతి అంటూ అమరావతి రైతులు రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తున్నారు. మరోవైపు మూడు రాజధానులే ముద్దు. అభివృద్ధి వికేంద్రీకరణే తమ లక్ష్యం.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు ఖచ్చితంగా ఉండాల్సిందేనని వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. మూడు రాజధానులపై తగ్గేదేలే అన్నట్టుగా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారు. అయితే.. ఏపీ ప్రభుత్వానికి మూడు రాజధానుల విషయంలో అడుగడుగునా అడ్డంకులు వస్తున్నాయి. అమరావతే అసలైన రాజధాని అంటూ హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది.
దీంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. త్వరలో కొత్త ధర్మాసనం ఈ కేసును పరిశీలించనుంది. కేసుపై ఇంకా వాదోపవాదాలు జరగాల్సి ఉంది. ఈనేపథ్యంలో సీఎం జగన్ సరికొత్త రూట్ ఎంచుకున్నారు. మూడు రాజధానులపై తన పంథాను కొనసాగించనున్నారు. అందుకే.. విశాఖ నుంచి త్వరలో పరిపాలన ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. పరిపాలన రాజధానిగా విశాఖను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో దానికోసం ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. సీఎం జగన్ కూడా విశాఖకు వెళ్లిపోతారని..
what is ys jagan next plan on three capitals in ap
సీఎం జగన్ ఎక్కడ ఉంటే అక్కడి నుంచే పాలన సాగుతుందని, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అక్కడే ఉంటారని తెలుస్తోంది. విశాఖ రాజధానికి ముహూర్తాన్ని సంక్రాంతికి ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. అంటే విశాఖ నుంచి సీఎం జగన్ త్వరలో పాలన సాగిస్తున్నారన్నమాట. ఇంకో రెండేళ్లలో ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజలు ఎలాంటి స్పందన తెలియజేస్తారో. అలాగే.. కర్నూలులోనూ త్వరలో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ రాయలసీమ వాసులు కూడా డిమాండ్ చేస్తున్నారు. కానీ.. హైకోర్టు అమరావతే రాజధాని అంటూ తీర్పు ఇవ్వడం, సుప్రీంకోర్టులో ఇంకా కేసు పెండింగ్ లో ఉండటంతో అసలు మూడు రాజధానుల అంశం ఎటువైపు వెళ్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.