
what is ys jagan next plan on three capitals in ap
YS Jagan : ప్రస్తుతం ఏపీ రాజకీయాలు మూడు రాజధానుల చుట్టే తిరుగుతున్నాయి. ఎందుకంటే.. ఓవైపు ఒకటే రాజధాని ముద్దు.. అదే అమరావతి అంటూ అమరావతి రైతులు రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తున్నారు. మరోవైపు మూడు రాజధానులే ముద్దు. అభివృద్ధి వికేంద్రీకరణే తమ లక్ష్యం.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు ఖచ్చితంగా ఉండాల్సిందేనని వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. మూడు రాజధానులపై తగ్గేదేలే అన్నట్టుగా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారు. అయితే.. ఏపీ ప్రభుత్వానికి మూడు రాజధానుల విషయంలో అడుగడుగునా అడ్డంకులు వస్తున్నాయి. అమరావతే అసలైన రాజధాని అంటూ హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది.
దీంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. త్వరలో కొత్త ధర్మాసనం ఈ కేసును పరిశీలించనుంది. కేసుపై ఇంకా వాదోపవాదాలు జరగాల్సి ఉంది. ఈనేపథ్యంలో సీఎం జగన్ సరికొత్త రూట్ ఎంచుకున్నారు. మూడు రాజధానులపై తన పంథాను కొనసాగించనున్నారు. అందుకే.. విశాఖ నుంచి త్వరలో పరిపాలన ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. పరిపాలన రాజధానిగా విశాఖను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో దానికోసం ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. సీఎం జగన్ కూడా విశాఖకు వెళ్లిపోతారని..
what is ys jagan next plan on three capitals in ap
సీఎం జగన్ ఎక్కడ ఉంటే అక్కడి నుంచే పాలన సాగుతుందని, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అక్కడే ఉంటారని తెలుస్తోంది. విశాఖ రాజధానికి ముహూర్తాన్ని సంక్రాంతికి ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. అంటే విశాఖ నుంచి సీఎం జగన్ త్వరలో పాలన సాగిస్తున్నారన్నమాట. ఇంకో రెండేళ్లలో ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజలు ఎలాంటి స్పందన తెలియజేస్తారో. అలాగే.. కర్నూలులోనూ త్వరలో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ రాయలసీమ వాసులు కూడా డిమాండ్ చేస్తున్నారు. కానీ.. హైకోర్టు అమరావతే రాజధాని అంటూ తీర్పు ఇవ్వడం, సుప్రీంకోర్టులో ఇంకా కేసు పెండింగ్ లో ఉండటంతో అసలు మూడు రాజధానుల అంశం ఎటువైపు వెళ్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…
Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…
Maruti Mini Brezza 2026 Review : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి Maruti Suzuki మరోసారి మార్కెట్లో…
Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్.…
AP Budget 2026-27 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రూ. 3,32,205 కోట్ల…
TG Municipal Elections : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సూర్యాపేటలో అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడమే కాకుండా,…
TG Municipal Results : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో నిజామాబాద్ కార్పొరేషన్ వేదికగా జరిగిన ఒక ఖరీదైన ఓటమి…
TG Municipal Elections : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీలో చోటుచేసుకున్న ఒక ఆసక్తికరమైన…
This website uses cookies.