Venu Swamy : వేణు స్వామి చెప్పినట్టుగానే త్వరలో విడాకులు తీసుకోబోతున్న నయనతార..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Venu Swamy : వేణు స్వామి చెప్పినట్టుగానే త్వరలో విడాకులు తీసుకోబోతున్న నయనతార..?

Venu Swamy : హీరోయిన్ నయనతార సౌత్ లోనే స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించి సౌత్ బ్యూటీగా మారారు. బాలీవుడ్ లో కూడా ఆమె నటించారు. పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్న నయనతారకు ముఖ్యంగా తమిళనాడు లో విపరీతమైన క్రేజ్ ఉంది. అక్కడ స్టార్ హీరోలతో సమానంగా ఆమె పాపులారిటీని సంపాదించుకున్నారు. లేడి ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక డైరెక్టర్ విగ్నేష్ శివన్ […]

 Authored By tech | The Telugu News | Updated on :5 March 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Venu Swamy : వేణు స్వామి చెప్పినట్టుగానే త్వరలో విడాకులు తీసుకోబోతున్న నయనతార..?

Venu Swamy : హీరోయిన్ నయనతార సౌత్ లోనే స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించి సౌత్ బ్యూటీగా మారారు. బాలీవుడ్ లో కూడా ఆమె నటించారు. పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్న నయనతారకు ముఖ్యంగా తమిళనాడు లో విపరీతమైన క్రేజ్ ఉంది. అక్కడ స్టార్ హీరోలతో సమానంగా ఆమె పాపులారిటీని సంపాదించుకున్నారు. లేడి ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నయనతార సరోగసి ద్వారా ఇద్దరు పిల్లల్ని కూడా కన్నారు. ఇక పెళ్ళికి ముందు నయనతార శింబు, ప్రభుదేవారతో ప్రేమాయణం సాగించిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక పెళ్లి తర్వాత నయనతార హవా కాస్త తగినట్లుగా ఉంది అని అంటున్నారు.

పెళ్లి తర్వాత నయనతార జీవితం అంత సాఫీగా సాగలేదని, పలు వివాదాలలో ఆమె చిక్కుకుంటున్నారని అంటున్నారు. సరోగసి ద్వారా పిల్లల్ని కని పెద్ద సంచలనం సృష్టించారు. అప్పుడు ఈమెపై చాలా ట్రోలింగ్ జరిగింది. ఈ సమస్య ముగిసిన వెంటనే నయనతార నటించిన అన్నపూరణి అనే సినిమా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ కొందరు కోర్టు వరకు వెళ్లారు. అలా పెళ్లి తర్వాత నయనతారకు కష్టాలు మొదలవుతాయని ఆమె విడాకులు తీసుకోవడం ఖాయమని గతంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పడం జరిగింది. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే నయనతార అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతుంది. సోషల్ మీడియాలో భర్త విగ్నేష్ శివన్ ను ఆమె అన్ ఫాలో చేయడం తో అసలు విషయం బయటకి వచ్చింది.

సోషల్ మీడియాలో విగ్నేష్ శివన్ ను అన్ ఫాలో చేయడంతో నయనతార విడాకులు తీసుకోబోతుందని నెటిజెన్లు భావిస్తున్నారు. అయితే దీనిపై అటు నయనతార కానీ ఇటు విగ్నేష్ శివన్ కానీ ఎవరు స్పందించలేదు. దీనిపై నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. పొరపాటున ఇలా జరిగి ఉండవచ్చని కొందరు కామెంట్స్ చేస్తుంటే, టెక్నికల్ సమస్య వల్ల విగ్నేష్ శివన్ పేరు కనిపించకపోవచ్చు అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏడేళ్లపాటు రిలేషన్ లో ఉండి మరి నయనతార విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకున్నారు. 2022లో వీరు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. అయితే జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పింది చెప్పినట్టుగానే నయనతార జీవితంలో జరుగుతుందని నెటిజన్లు భావిస్తున్నారు. ఈవిడాకులపై వస్తున్న వార్తలపై నయనతార స్పందిస్తే కానీ నిజం ఏంటనేది తెలియదు.

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది