Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్ రెడ్డిది ప్రత్యేక స్థానం అనడంలో సందేహం లేదు. తెలుగు దేశం పార్టీలో ఉన్న సమయంలో ఒంటరిగా అధికార టీఆర్ఎస్ పార్టీపై సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డ రేవంత్ రెడ్డి రాజకీయ బలం కోసం కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాడు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడంతో ఆ పార్టీ బలం మరింతగా పెరిగి 2018 ఎన్నికల్లో కలిసి వస్తుందని అనుకుంటే కేసీఆర్ ప్రభంజనం ముందు మరోసారి కాంగ్రెస్ దాంతో పాటు రేవంత్ రెడ్డి కూడా కొట్టుకు పోయాడు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి ని పీసీసీ ప్రెసిడెంట్ గా ఎంపిక చేయడం వల్ల ఖచ్చితంగా పార్టీ బలం పెరుగుతుందని కొందరు అన్నారు. కాని సీనియర్లు పార్టీ అధినాయకత్వం వద్ద రేవంత్ రెడ్డిని పల్చన చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారు. రేవంత్ రెడ్డికి పదవి ఇవ్వకుండా చేయగలిగారు.
రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి వస్తుంది దాంతో ఆయన పార్టీకి మళ్లీ పునరుత్తేజం తీసుకు వస్తాడని ఇన్నాళ్లు ఆయన వెంట తెలుగు దేశం పార్టీ నుండి వచ్చిన వారు అనుకున్నారు. కాని పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. కాంగ్రెస్ అధినాయకత్వం అలసత్వం మరియు రాష్ట్ర సీనియర్ నాయకుల ఈగోలతో అధికార టీఆర్ఎస్ పార్టీకి పోటీ ఇవ్వలేక పోగా బీజేపీ వచ్చి చేరడంతో మూడవ స్థానంకు పడిపోయే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి వెనుక ఉన్న చాలా మంది నాయకులు మెల్ల మెల్లగా బీజేపీ లో జాయిన్ అవుతున్నారు. వారిని బీజేపీలో జాయిన్ అవ్వమని చెప్పిందే రేవంత్ రెడ్డి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. త్వరలో జరుగబోతున్న నాగార్జున సాగర్ ఎన్నిక తర్వాత పీసీసీ చీప్ ను నియమించే అవకాశం ఉంది. అప్పుడు తనకు ప్రాముఖ్యత ఇవ్వకుంటే రేవంత్ రెడ్డి తప్పుకునేందుకు సిద్దం అవుతున్నాడట.
బీజేపీలో జాయిన్ అయ్యేందుకు రేవంత్ రెడ్డి ఆసక్తిగా ఉన్నాడనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా ఇన్నాళ్లు మెలిగిన కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు. త్వరలోనే ఆయన బీజేపీలో జాయిన్ అవుతాడు అంటూ రాజకీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఆయన్ను ఆపాలంటే రేవంత్ రెడ్డి వల్ల అవుతుంది. కాని ఆయన బీజేపీలో చేరితేనే అన్ని విధాలుగా బెటర్ అనే ఉద్దేశ్యంతో రేవంత్ రెడ్డి ఉన్నాడట. ఇంకా పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా బీజేపీలో జాయిన్ అయ్యారు.. మరి కొందరు బీజేపీ వైపు చూస్తున్నారు. ఈ పరిణామాలు అన్ని చూస్తుంటే వారందరు వెళ్లిన తర్వాత వారి దారిలో రేవంత్ రెడ్డి కూడా కాషాయం ధరించే అవకాశం ఉందని అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.