
Revanth reddy
Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్ రెడ్డిది ప్రత్యేక స్థానం అనడంలో సందేహం లేదు. తెలుగు దేశం పార్టీలో ఉన్న సమయంలో ఒంటరిగా అధికార టీఆర్ఎస్ పార్టీపై సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డ రేవంత్ రెడ్డి రాజకీయ బలం కోసం కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాడు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడంతో ఆ పార్టీ బలం మరింతగా పెరిగి 2018 ఎన్నికల్లో కలిసి వస్తుందని అనుకుంటే కేసీఆర్ ప్రభంజనం ముందు మరోసారి కాంగ్రెస్ దాంతో పాటు రేవంత్ రెడ్డి కూడా కొట్టుకు పోయాడు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి ని పీసీసీ ప్రెసిడెంట్ గా ఎంపిక చేయడం వల్ల ఖచ్చితంగా పార్టీ బలం పెరుగుతుందని కొందరు అన్నారు. కాని సీనియర్లు పార్టీ అధినాయకత్వం వద్ద రేవంత్ రెడ్డిని పల్చన చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారు. రేవంత్ రెడ్డికి పదవి ఇవ్వకుండా చేయగలిగారు.
రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి వస్తుంది దాంతో ఆయన పార్టీకి మళ్లీ పునరుత్తేజం తీసుకు వస్తాడని ఇన్నాళ్లు ఆయన వెంట తెలుగు దేశం పార్టీ నుండి వచ్చిన వారు అనుకున్నారు. కాని పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. కాంగ్రెస్ అధినాయకత్వం అలసత్వం మరియు రాష్ట్ర సీనియర్ నాయకుల ఈగోలతో అధికార టీఆర్ఎస్ పార్టీకి పోటీ ఇవ్వలేక పోగా బీజేపీ వచ్చి చేరడంతో మూడవ స్థానంకు పడిపోయే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి వెనుక ఉన్న చాలా మంది నాయకులు మెల్ల మెల్లగా బీజేపీ లో జాయిన్ అవుతున్నారు. వారిని బీజేపీలో జాయిన్ అవ్వమని చెప్పిందే రేవంత్ రెడ్డి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. త్వరలో జరుగబోతున్న నాగార్జున సాగర్ ఎన్నిక తర్వాత పీసీసీ చీప్ ను నియమించే అవకాశం ఉంది. అప్పుడు తనకు ప్రాముఖ్యత ఇవ్వకుంటే రేవంత్ రెడ్డి తప్పుకునేందుకు సిద్దం అవుతున్నాడట.
Revanth reddy
బీజేపీలో జాయిన్ అయ్యేందుకు రేవంత్ రెడ్డి ఆసక్తిగా ఉన్నాడనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా ఇన్నాళ్లు మెలిగిన కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు. త్వరలోనే ఆయన బీజేపీలో జాయిన్ అవుతాడు అంటూ రాజకీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఆయన్ను ఆపాలంటే రేవంత్ రెడ్డి వల్ల అవుతుంది. కాని ఆయన బీజేపీలో చేరితేనే అన్ని విధాలుగా బెటర్ అనే ఉద్దేశ్యంతో రేవంత్ రెడ్డి ఉన్నాడట. ఇంకా పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా బీజేపీలో జాయిన్ అయ్యారు.. మరి కొందరు బీజేపీ వైపు చూస్తున్నారు. ఈ పరిణామాలు అన్ని చూస్తుంటే వారందరు వెళ్లిన తర్వాత వారి దారిలో రేవంత్ రెడ్డి కూడా కాషాయం ధరించే అవకాశం ఉందని అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.
Gold : భారతీయుల జీవితంలో బంగారం అనేది కేవలం ఒక లోహం కాదు అది సంప్రదాయం, భద్రత, భవిష్యత్తుకు సంకేతం.…
Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలో రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు…
Palapandlu : ఎండాకాలం రాగానే మార్కెట్లో కొన్ని ప్రత్యేకమైన అడవి పండ్లు ఎక్కువగా కనిపిస్తాయి. వాటిలో ముఖ్యంగా “పాల పండ్లు”…
Lemon Juice : ఎండాకాలం ప్రారంభమైతే చాలు దాహం వేధించడం మొదలవుతుంది. అలాంటి వేళలో మనకు వెంటనే గుర్తొచ్చేది చల్లని…
Coconut Water : దేశవ్యాప్తంగా ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మధ్యాహ్నం వేళ…
AP Survey : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి. అధికారం ఎవరిది అన్న విషయంపై ఎప్పుడూ ఉత్కంఠ కొనసాగుతూనే…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన లండన్ ప్రయాణం అవుతుండటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో…
Telangana BJP : తెలంగాణ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ బలం పుంజుకోలేకపోవడానికి ప్రధాన కారణం గతంలో జరిగిన నియోజకవర్గాల…
Mahasena Rajesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకటే పేరు మారుమోగిపోతోంది. అదే మహాసేన రాజేష్. సోషల్ మీడియాలో తనదైన…
Modi : మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్ సభలో వీగిపోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఎన్డీఏ ప్రభుత్వం…
Viral video : తెలుగు బుల్లితెర ప్రపంచంలో ప్రేక్షకులను అలరించేందుకు ఛానెళ్లు కొత్త కాన్సెప్ట్లతో ముందుకు వస్తున్నాయి. కామెడీ, కుకింగ్,…
Dwakra Group : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి పలు సంక్షేమ పథకాలను అమలు…
This website uses cookies.