
kodali nani 1
Kodali Nani : మున్సిపాలిటీ ఎన్నికల్లో ఘోర పరాజయం చెంది తీవ్ర ఆవేదనలో ఉన్న చంద్రబాబుకు ఫలితాలు వెల్లడైన మరుసటి రోజే మరో భారీ షాక్ తగిలింది. నవ్యాంధ్ర రాజధానిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇవాళ ఉదయం సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం విదితమే. ఈ నోటీసులివ్వడాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా తప్పు పడుతూ జగన్ మీద వైసీపీ ప్రభుత్వం మీద ఆరోపణల చేస్తున్నారు.
Kodali Nani fires at achennayudu and buddha venkanna
దీనిపై మంత్రి కొడాలి నాని వైసీపీ కార్యాలయంలో మీడియా మీట్ నిర్వహించి మాట్లాడటం జరిగింది. అమరావతిలో దళితులను మోసం చేసేలా చంద్రబాబు అండ్ కో భారీ భూ స్కాంలు చేశారని సంచలన ఆరోపణలు చేశారు.సీఆర్డీఏ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇచ్చిన ఏకపక్ష జీఓలతో, దళిత వర్గాలను మోసం చేశారని నాని వ్యాఖ్యానించారు. ఆంబోతులా అచ్చెన్నాయుడు అరుస్తున్నా.. కుక్కలా బుద్ధ వెంకన్న మొరుగుతున్నా మేం అదిరేది లేదు, బెదిరేది లేదు. అక్రమ మార్గాల్లో భూములు కాజేసిన పలువురికి ఇప్పటికే 41సీ నోటీసులు జారీ చేశారు. రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు చేసిన స్కాం లకు సీఐడీ నోటీసులు ఇస్తే తప్పేంటి..?’ అని కొడాలి నాని ప్రశ్నించారు.
‘అమరావతిలో అసైన్మెంట్ భూముల హక్కు దారులైన దళిత వర్గాలను బెదిరించి, మోసపూరిత ప్రచారాలు చేసి, నామమాత్ర ధర చెల్లించి, అక్రమ జీవోల ద్వారా చంద్రబాబు బ్యాచ్ కోట్లు కాజేశారు. దళిత వర్గాలను మోసం చేసిన చంద్రబాబు అండ్ కో పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నమోదు చేయాలి. చంద్రబాబు స్క్రిప్ట్ ఫాలో అవుతూ కుమ్మక్కు రాజకీయాలు చేసే ప్రతిపక్షాలకంటే మాకు దళిత వర్గాల ప్రయోజనాలే ముఖ్యం. ప్రజలను మోసం చేసిన చంద్రబాబు సీఐడీ, కోర్టులకు జవాబు చెప్పాలి. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలకు న్యాయం చేయడమే ముఖ్యం. దళితులకు న్యాయం చేసేలా చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలి’ అని సీఐడీని మంత్రి నాని కోరారు.
మరోపక్క టీడీపీ నేతలందరూ దీనిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ, కేవలం ఇదీ కక్ష్య సాధింపు కోసమే నోటీసులు ఇస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎలాగైన చంద్రబాబుపై బురద చల్లాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తాను జైలుకు వెళ్లాడని.. తన దారిలో అందరు జైలుకు వెళ్లాలనే జగన్ ఆలోచన కరెక్ట్ కాదని ఆయన విమర్శించారు.
మరో నేత గోరంట్ల బుచ్చియ్య చౌదరి మాట్లాడుతూ అమరావతి కోసం రైతులు పోరాటం చేస్తున్నారని అన్నారు. దాన్ని పక్కదోవ పట్టించేందుకు తప్పుడు కేసులు పెట్టి.. కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని, ఇందులో చంద్రబాబుకు ఎటువంటి సంబంధంలేదని న్యాయస్థానం పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయినా చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం సీఎం జగన్ చేస్తున్నారని విమర్శించారు. అక్రమాస్తుల్లో 16 నెలలు జైల్లో ఉన్న జగన్… ఇవాళ కేంద్రం దయాదాక్షిణ్యాలతో బెయిల్పై బయట తిరుగుతున్నారని అన్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబుపై తప్పుడు ఆరోపణలతో కేసుపెడుతున్నారని, ఇది నిలబడదని గోరంట్ల వ్యాఖ్యానించారు.
Tipparthi : నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర రోడ్లు, భవనాలు (ఆర్ అండ్…
12 Years Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ పాలనలో 12 సంవత్సరాల మైలురాయిని…
Bharathiraja Passes Away : దక్షిణ భారత సినీ పరిశ్రమలో మరో దిగ్గజం అస్తమించింది. తమిళ చిత్రసీమకు గ్రామీణ కథల…
Viral Video : దేశానికి అన్నం పెట్టే రైతు కుటుంబాలు ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటున్నాయో చెప్పే మరో హృదయ విదారక…
Heavy Rain Alert : తెలంగాణ రాష్ట్రంలో వర్షాల జోరు కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా పలు జిల్లాల్లో వర్షాలు…
Farmers : దేశంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. రైతుల…
Komatireddy Venkat Reddy : నల్లగొండ జిల్లాలో Nalgonda అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర రోడ్లు,…
AP Thalliki Vandanam Scheme : ఆంధ్రప్రదేశ్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి సిద్ధమవుతున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయాలపై…
Peddi 6 Days Box Office Collection : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ram charan హీరోగా,…
Students Good News : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక…
PM Kisan : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం…
Gold Rate Today : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి శుభవార్త అందింది. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు…
This website uses cookies.