మట్టి విగ్రహాలతోనే పర్యావరణానికి మేలు జరుగుతుందని, కావున ప్రతీ ఒక్కరు వాటినే వాడాలని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లిలో ఆయన మట్టి గణపతుల ప్రతిమలను పలువురికి శుక్రవారం పంపిణీ చేశారు. మట్టితో చేసిన గణనాథులనే ప్రజలు పూజించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసమై ప్రతీ ఒక్కరు మట్టి గణేశుడి ప్రతిమలనే పూజించాలన్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని పట్టణంలోని పలు వీధుల్లో ప్రజలు విఘ్నేశ్వర విగ్రహాలను ప్రతిష్టించారు. ఇకపోతే గాంధీ బొమ్మ సెంటర్లో ఆర్య వైశ్య యువజన సంఘం అధ్యక్షులు రామకృష్ణ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
పర్యావరణానికి ఎటువంటి నష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపైన ఉందని తెలిపారు. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా బాధ్యత తీసుకుని పర్యావరణ పరిరక్షణకుగాను తమ వంతు పాటు పడాలని చెప్పారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి గణేశులను పూజించడం ద్వారా పండుగ ప్రాశస్త్యం నెరవేరడంతో పాటు పర్యావరణానికి మేలు జరుగుతుందని పెద్దలు చెప్తున్నారు.
Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…
Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ (PM E-డ్రైవ్)…
TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…
Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…
Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…
Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…
Shekar Basha : బిగ్బాస్ తెలుగు 8 సక్సెస్ ఫుల్గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…
Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…
This website uses cookies.