Health Tips : మనం చాలామందిలో వాళ్ళ శరీరంపై ఎక్కడ పడితే అక్కడ పులిపర్లు ఉండడం చూస్తూనే ఉంటాం. కొన్ని అవయవాలపై పులిపర్లు ఉండి చాలా చిరాకును తెప్పిస్తూ ఉంటాయి. ఇవి బరువు ఎక్కువగా ఉండడం వలన వైరస్ల వల్ల గాని ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించడం వలన కానీ వస్తూ ఉంటాయి. వీటి నుండి బయటపడడం కోసం హాస్పటల్ చూట్టు తిరుగుతూ ఉంటారు. అయితే ఏదో ఒక మూల వాటి తాలూకా మచ్చలు కూడా వస్తూ ఉంటాయి. వాటిని తగ్గించుకోవడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ వాటికోసం ఎన్నో రకాల కెమికల్ ఉన్న మందులను వాడుతూ ఉంటారు. అయితే వాటి వలన ఎటువంటి రిజల్ట్ ఉండదు. అయితే వాటికోసం ఇప్పుడు మనం చేయబోయే చిట్కా ఈ చిట్కా వాటి నుంచి బయట
పడేయడమే కాకుండా వాటి తాలూకా మచ్చలు కూడా తగ్గిపోయేలా చేస్తుంది. అయితే దీన్ని మూడు రోజులు వాడవలసి ఉంటుంది. మీరు ఈ చిట్కాని తయారు చేయడానికి వాడేవి అన్ని మన ఇంట్లో దొరుకుతాయి. కాబట్టి వీటి వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవు. ఇప్పుడు ఈ మిశ్రమం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.. దీనికోసం మొదటగా మనం ఒక బౌల్ని తీసుకొని దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ తమలపాకులు వాడే సున్నం వేసుకోవాలి. ఇప్పుడు ఒక అర చెంచా పసుపు కూడా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో ఒక అరచెంచా వంట సోడా కూడా కలుపుకోవాలి. ఈ మూడిటిని కొద్దిగా నీటిని వేసి పేస్ట్ లాగా బాగా కలుపుకోవాలి. ఇది మరీ పల్చగా అవ్వకూడదు. మీరు నొప్పిని తట్టుకుంటాం అనే వాళ్ళు వంట సోడాకు బదులుగా నిమ్మరసం కూడా వాడుకోవచ్చు.ఈ నిమ్మరసం వల్ల కొద్దిగా నొప్పి అలాగే మంట కలిగిస్తుంది.
దీనిలో పసుపు మరియు సున్నం కలపడం వలన మిశ్రమం యొక్క రంగు ఎరుపు రంగులోకి మారుతుంది. ఈ విధంగా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని పులిపర్ల ఉన్న ప్రదేశంలో చిన్నగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా చేసిన తరువాత ఒక 10 నిమిషాలు పాటు అలా వదిలేయాలి. కొద్దిసేపు తర్వాత సాధారణమైన నీటితో ముఖంని క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా రోజుకి మూడుసార్లు అప్లై చేయాలి. పులిపర్ల సైజును బట్టి అవి సమయం ఎక్కువ అవుతూ ఉంటుంది. చిన్న పరిమానంలో ఉండేవి రెండు మూడు రోజుల్లో తగ్గిపోతాయి. పెద్ద సైజులో ఉండే పులిపర్లు రాలిపోవడానికి కొద్దిగా ఎక్కువ సమయమే పడుతుంది. ఈ చిట్కాని వాడేటప్పుడు కంటి దగ్గర కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధంగా రోజుకు మూడుసార్లు ఉపయోగించడం వలన మీ పులిపర్లు అలాగే మచ్చలు కూడా తగ్గిపోతాయి.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.