Beauty Tips : చాలా మందిని ముఖంపై మొటిమలు తీవ్రంగా బాధపెడుతుంటాయి. ఏ ఫంక్షన్ కు వెళ్లాలన్నా తెలియని అన్ కంఫర్ట్ ఉంటుంది. అలాగే ముఖంపై ఉండే మచ్చలు, పాలిపోయినట్లుండే ఫేస్ అదో చికాకు. అలాంటి వారి కోసమే ఈ చిట్కా. ఇంట్లోనే దీనిని తయారు చేసుకుని ముఖానికి పెట్టుకుంటే మంచి సౌందర్యం సొంతమవుతుంది. మినపప్పుతో చేసుకునే ఈ చిట్కా చక్కగా పనిచేస్తుంది. క్రీమ్ లా తయారు చేసుకుని చర్మ రక్షణ కోసం ఉపయోగించవచ్చు. దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చర్మంపై ముడతలు, మచ్చలు తగ్గుతాయి.చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో చాలా బాగా పని చేస్తుంది మినపప్పు.
ఈ మినపప్పు క్రీమును తయారు చేసుకోవడం చాలా సులభం. దాని కోసం ఒక కప్పు మినప్పప్పును రాత్రంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఆ పప్పును శుభ్రంగా కడగాలి. దానిని మెత్తని పేస్టులాగ మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న పేస్టును కాటన్ క్లాత్లో వేసి దానిని ఒక గిన్నెలో వేయాలి. ఆ వస్త్రాన్ని గట్టిగా పిండడం ద్వారా దాని నుండి పాల లాంటి నీరు వస్తుంది. ఇలా మొత్తం నీటిని పిండుకున్న తర్వాత దానిని ఒక పాన్ లో వేసుకుని స్టవ్ పై మెల్లగా వేడి చేసుకోవాలి. నీరు దగ్గరికి వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఆ పేస్టును గాజు గిన్నెలో నిల్వ చేసుకోవచ్చు. ఈ పేస్టును ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖంపై ఉండే మడతలు తొలిగిపోతాయి. మచ్చలు పోతాయి.
క్రమం తప్పకుండా ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.ఈ పేస్టును ముఖానికి పెట్టుకున్న తర్వాత నెమ్మదిగా మసాజ్ చేయాలి. చేతి వేళ్ల కొనల ద్వారా మర్దన చేసుకోవాలి. ఓ పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. అలా చేయడం వల్ల ముఖం కాంతి వంతంగా… అందంగా తయారవడమే కాకుండా మిల మిలా మెరిసిపోతుంది. మీ ముఖాన్ని చూసి మీరే ప్రేమలో పడొచ్చు. అలాగే చర్మాన్ని పాలిషింగ్ కోసం ఈ క్రమంలో అలోవెరా జెల్, విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసి బాగా కలిపి ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మాన్ని పాలిష్ చేయడంతో పాటు చర్మంలో తేమ కాపాడినట్లు అవుతుంది. దీని వల్ల చర్మం కాంతి వంతంగా కనిపిస్తుంది.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.