Diabetes : ప్రస్తుతం చాలామంది డయాబెటిస్ సమస్యలతో బాధపడుతున్నారు. దీనిని కంట్రోల్ చేయడానికి మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు. కానీ మీ దినచర్యలో ఒక చిన్న పనిని చేయడం ద్వారా మధుమేహాన్ని కంట్రోల్ చేయవచ్చు. శరీరంలో ఇన్సులిన్ లోపం వల్ల డయాబెటిస్ వస్తుంది. ఇన్సులిన్ శరీరంలోని గ్లూకోస్ స్థాయిని నియంత్రిస్తుంది. అయితే టైప్ 2 డయాబెటిస్ లో ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. కానీ తక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఇన్సులిన్ అనేది జీర్ణ గ్రంధి ద్వారా ఉత్పత్తి చేయబడిన హార్మోన్. ఇది ఆహారాన్ని శక్తిగా మారుస్తాయి. ఇన్సులిన్ తక్కువగా ఉత్పత్తి కావడం వలన రక్తంలో గ్లూకోస్ మొత్తం పెంచుతుంది. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి టాబ్లెట్స్ తీసుకోవడం, ఒత్తిడికి దూరంగా ఉండడం, ఆహారాన్ని నియంత్రించడం వంటివి చేయాలి.
దీని ద్వారా రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. షుగర్ సమస్య ఉంటే దాన్ని అదుపు చేయడం కష్టంగా ఉంటుంది. అయితే రోజు కొద్దిసేపు నడవడం వలన డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. ఆహారం తిన్న తర్వాత ఐదు నిమిషాలు వాకింగ్ చేస్తే డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. ఆహారం తిన్న తర్వాత రక్తంలో గ్లూకోస్ పెరుగుతుంది. మన ఏదైనా తిన్న తర్వాత విశ్రాంతి తీసుకుంటే కార్బోహైడ్రేట్ల నుంచి తయారయ్యే శక్తి ఉపయోగించబడదు. చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరుగుతుంది. ఆహారం తిన్న తర్వాత కొద్దిసేపు నడవడం ద్వారా డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
అలాగే శారీరక వ్యాయామంతో పాటు మనం తీసుకునే ఆహారం చక్కెరను నియంత్రణలో ఉంచుతుంది. డయాబెటిస్ ఉన్నవారు ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోకూడదు. డయాబెటిస్ ఉన్నవారు అధిక గ్లైసమిక్ ఇంటెక్స్ ఉన్న వాటిని తినకూడదు. పుచ్చకాయ, ద్రాక్ష, అరటిపండు వంటి వాటిలో అధిక గ్లైసిమిక్ ఉంటుంది. బియ్యం, బంగాళదుంపలలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని కూడా అస్సలు తినకూడదు. శీతల పానీయాలు, బ్రెడ్ తో చేసిన వాటిని తినకూడదు. డయాబెటిస్ ఉన్నవారు కీవీ , రేగుపండ్లను తినడం మంచిది. తీపి పదార్థాలు పూర్తిగా తినడం మానేయాలి. డయాబెటిస్ ఉన్నవారు ఎక్కువ ఆయిల్, స్పైసీ ఫుడ్లను తినకూడదు.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.