Meals : మనలో ఎంతోమందికి భోజనం చేసేటప్పుడు మధ్యలో నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. అయితే మీకు ఉన్న ఈ అలవాటు మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని తెలుసా. అయితే చాలామంది భోజనం చేసేటప్పుడు నీళ్లు, ముఖ్యంగా చల్లాటి నీళ్ళు తాగటం ఎంతో అవసరం అని భావిస్తారు. అయితే మనం భోజనం చేసేటప్పుడు అధికంగా నీటిని తీసుకోవటం వలన మనం తీసుకునే ఆహారం అనేది తొందరగా జీర్ణం అవుతుందని అనుకుంటారు. కానీ ఈ అలవాటు అనేది ఆరోగ్యానికి ఎంతో హానికరం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇలా చేయటం వలన శరీరంలో ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం…
మనం భోజనం చేసేటప్పుడు మధ్యలో నీటిని తాగటం వలన మనం తీసుకునే ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. సాధారణంగా మనం తీసుకునే ఆహారంతో మన శరీరంలో జీర్ణక్రియ అనేది జరగడం కోసం కొన్ని రసాయనాలు అనేవి రిలీజ్ అవుతాయి. అయితే మనం భోజనం మధ్యలో నీళ్లు తీసుకోవడం వలన ఆ రసాయనాల గడత అనేది తగ్గి మనం తీసుకున్న ఆహారం అనేది సరిగ్గా జీర్ణం కాదు. మనం భోజనం చేసేటప్పుడు మధ్యలో నీటిని తీసుకోవటం వలన జీర్ణ ఎంజైమ్ లు అనేవి దెబ్బతింటాయి. అప్పుడు ఇది గ్యాస్టిక్ సమస్యలను కలిగిస్తుంది. అయితే జీర్ణ క్రియ కు లాలాజలం అనేది చాలా అవసరం. అలాగే భోజనం టైంలో నీళ్లు తీసుకోవడం వలన మీ లాలాజలం అనేది ఎంతో పల్చగా మారుతుంది. సాధారణంగా భోజనంతో పాటుగా నీళ్లను తీసుకోవడం వలన బరువు పెరగటం కూడా పెద్ద సమస్యగా మారుతుంది. అంతేకాక భోజనం మధ్యలో నీరు తీసుకోవటం వల్ల జీర్ణ వ్యవస్థ అనేది బలహీనంగా తయారవుతుంది…
భోజనం మధ్యలో నీటిని తీసుకోవటం వలన శరీరంలో ఇన్సూలిన్ స్థాయిలు కూడా ఎంతగానో పెరుగుతాయి. ఇది మొత్తం రక్తంలోని చక్కెర స్థాయిలను పెంచే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అని అంటున్నారు నిపుణులు. అలాగే భోజనం తీసుకున్న వెంటనే నీళ్లు తీసుకోవడం వలన బరువు కూడా తొందరగా పెరుగుతారు అని అంటున్నారు. దీనివలన ఊబకాయం బారిన పడే అవకాశం కూడా ఉంటుంది అని అంటున్నారు నిపుణులు. భోజనం చేసిన తర్వాత నీళ్లను తీసుకోవడం వలన ఆహారాన్ని జీర్ణం చేసేందుకు జీర్ణ వ్యవస్థ తీసుకొనె టైం ను నీళ్లు తీసుకోవడం ద్వారా మార్చేస్తున్నట్లు లెక్క. దీంతో ఊహించిన దానికన్నా ముందుగానే ఆకలి అనేది వేస్తుంది. అలాగే కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు…
Ginger Juice : అల్లం లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే సంగతి మన అందరికీ తెలిసిన…
Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…
New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…
Boom Boom Beer : ఏపీలో మద్యం ప్రియులు గత కొన్నాళ్లుగా సరికొత్త విధానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…
Ap Womens : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వడివడిగా అడుగులు…
New Liquor Policy : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. కొత్తగా మద్యం…
Chandrababu : గత కొన్ని రోజులుగా ఏపీలో మెడికల్ సీట్ల వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. తన హయాంలో…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్…
This website uses cookies.