Meals : భోజనం మధ్యలో నీళ్లు తాగితే… మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Meals : భోజనం మధ్యలో నీళ్లు తాగితే… మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా…!

Meals : మనలో ఎంతోమందికి భోజనం చేసేటప్పుడు మధ్యలో నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. అయితే మీకు ఉన్న ఈ అలవాటు మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని తెలుసా. అయితే చాలామంది భోజనం చేసేటప్పుడు నీళ్లు, ముఖ్యంగా చల్లాటి నీళ్ళు తాగటం ఎంతో అవసరం అని భావిస్తారు. అయితే మనం భోజనం చేసేటప్పుడు అధికంగా నీటిని తీసుకోవటం వలన మనం తీసుకునే ఆహారం అనేది తొందరగా జీర్ణం అవుతుందని అనుకుంటారు. కానీ ఈ అలవాటు అనేది ఆరోగ్యానికి […]

 Authored By ramu | The Telugu News | Updated on :28 July 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Meals : భోజనం మధ్యలో నీళ్లు తాగితే... మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా...!

Meals : మనలో ఎంతోమందికి భోజనం చేసేటప్పుడు మధ్యలో నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. అయితే మీకు ఉన్న ఈ అలవాటు మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని తెలుసా. అయితే చాలామంది భోజనం చేసేటప్పుడు నీళ్లు, ముఖ్యంగా చల్లాటి నీళ్ళు తాగటం ఎంతో అవసరం అని భావిస్తారు. అయితే మనం భోజనం చేసేటప్పుడు అధికంగా నీటిని తీసుకోవటం వలన మనం తీసుకునే ఆహారం అనేది తొందరగా జీర్ణం అవుతుందని అనుకుంటారు. కానీ ఈ అలవాటు అనేది ఆరోగ్యానికి ఎంతో హానికరం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇలా చేయటం వలన శరీరంలో ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం…

మనం భోజనం చేసేటప్పుడు మధ్యలో నీటిని తాగటం వలన మనం తీసుకునే ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. సాధారణంగా మనం తీసుకునే ఆహారంతో మన శరీరంలో జీర్ణక్రియ అనేది జరగడం కోసం కొన్ని రసాయనాలు అనేవి రిలీజ్ అవుతాయి. అయితే మనం భోజనం మధ్యలో నీళ్లు తీసుకోవడం వలన ఆ రసాయనాల గడత అనేది తగ్గి మనం తీసుకున్న ఆహారం అనేది సరిగ్గా జీర్ణం కాదు. మనం భోజనం చేసేటప్పుడు మధ్యలో నీటిని తీసుకోవటం వలన జీర్ణ ఎంజైమ్ లు అనేవి దెబ్బతింటాయి. అప్పుడు ఇది గ్యాస్టిక్ సమస్యలను కలిగిస్తుంది. అయితే జీర్ణ క్రియ కు లాలాజలం అనేది చాలా అవసరం. అలాగే భోజనం టైంలో నీళ్లు తీసుకోవడం వలన మీ లాలాజలం అనేది ఎంతో పల్చగా మారుతుంది. సాధారణంగా భోజనంతో పాటుగా నీళ్లను తీసుకోవడం వలన బరువు పెరగటం కూడా పెద్ద సమస్యగా మారుతుంది. అంతేకాక భోజనం మధ్యలో నీరు తీసుకోవటం వల్ల జీర్ణ వ్యవస్థ అనేది బలహీనంగా తయారవుతుంది…

Meals భోజనం మధ్యలో నీళ్లు తాగితే మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా

Meals : భోజనం మధ్యలో నీళ్లు తాగితే… మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా…!

భోజనం మధ్యలో నీటిని తీసుకోవటం వలన శరీరంలో ఇన్సూలిన్ స్థాయిలు కూడా ఎంతగానో పెరుగుతాయి. ఇది మొత్తం రక్తంలోని చక్కెర స్థాయిలను పెంచే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అని అంటున్నారు నిపుణులు. అలాగే భోజనం తీసుకున్న వెంటనే నీళ్లు తీసుకోవడం వలన బరువు కూడా తొందరగా పెరుగుతారు అని అంటున్నారు. దీనివలన ఊబకాయం బారిన పడే అవకాశం కూడా ఉంటుంది అని అంటున్నారు నిపుణులు. భోజనం చేసిన తర్వాత నీళ్లను తీసుకోవడం వలన ఆహారాన్ని జీర్ణం చేసేందుకు జీర్ణ వ్యవస్థ తీసుకొనె టైం ను నీళ్లు తీసుకోవడం ద్వారా మార్చేస్తున్నట్లు లెక్క. దీంతో ఊహించిన దానికన్నా ముందుగానే ఆకలి అనేది వేస్తుంది. అలాగే కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది