Sravana Masam : లయకారుడైన పరమశివుడికి ఇష్టమైన మాసాలలో శ్రావణమాసం ఒకటి. ఈ సమయంలో పరమేశ్వరుడిని పూజించడం ద్వారా అనుకున్న కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతారు. ఈ నమ్మకంతో భారతదేశంలోని పురాతన ఆలయాలను సందర్శిస్తున్నారు. భారతదేశంలో ఇలాంటి పురాణాలు కలిగిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ఇందులో అత్యంత విశిష్టమైన దేవాలయాలకు సంబంధించిన సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో మీరు ఏ ఒక్క దేవాలయాలని సందర్శించిన మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయని ధార్మికవేతలు చెబుతున్నారు. శ్రావణమాసం ముగియడానికి ఇంకా 30 రోజుల సమయం ఉంది. కాబట్టి ఈ సమయంలో ఏదో ఒక ఆలయానికి వెళ్లడానికి ప్రయత్నించండి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
భారతదేశంలోని జ్యోతి లింగాలలో ఒకటైన సోమనాథ్ దేవాలయం గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఈ దేవాలయం అత్యంత ప్రాచీనమైనది. జ్యోతి లింగాలలో మొదటి క్షేత్రం. దీనిని ప్రభాసతీర్థం అని కూడా పిలుస్తారు.
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం ఉంది. నల్లమల్ల అడవుల్లో కృష్ణానది ఒడ్డున ఈ దేవాలయం జ్యోతి లింగాలలో ఒకటి. ఇక్కడ ఆ పరమశివుడు భ్రమరాంబ సహితంగా భక్తులకు దర్శనం ఇస్తాడు.
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఉన్న మహా కాలేశ్వరం పురాణ ప్రాధాన్యత కలిగినది. ఇక్కడ పరమేశ్వరుడు మహాకాళి రూపంలో కొలువై ఉన్నాడు. ప్రతిరోజు ఉదయం జరిగే బస్మహారతిని చూడడానికి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు.
మధ్యప్రదేశ్ లోని నర్మదా నది మధ్యలో ఉన్న మంద తండి దీపంలో ఓంకారేశ్వర దేవాలయం ఉంది. ఆకాశం నుంచి చూస్తే ఈ దీపం ఓంకార రూపంలో కనిపిస్తుంది. కాబట్టే దీనికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. అలాగే ఇక్కడ పరమేశ్వరుడు మూడు ముక్కాల రూపంలో కనిపిస్తాడు. ముఖ్యంగా శ్రావణమాసం రోజు జరిగే ప్రత్యేక పూజలకు వేల మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు.
మహారాష్ట్ర పూణేకు 127 కిలోమీటర్ల దూరంలో ఉంది. భీమా నది ఒడ్డున ఈ క్షేత్రం ప్రకృతి సంపదతో నిండి ఉంటుంది. ఇక్కడ పరమేశ్వరుడు భీమ శంకరుడి పేరుతో షాకిని దాకిని మొదలైన రాక్షసుల గణాలతో సేవించబడతాడని ప్రతిది.
భారతదేశపు అతి ప్రాచీ నగరాలలో కాశి ఒక్కటి. దీనిని వారణాసి అని కూడా పిలుస్తారు. ఇక్కడ పరమేశ్వరుడు విశ్వనాథుడిని పేరుతో పూజలు అందుకుంటూ ఉంటాడు. ఇక్కడ గంగా నదిలో స్నానం చేస్తే అప్పటివరకు చేసిన పాపాలన్నీ పోతాయని హిందూ భక్తులు నమ్ముతారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.