Throat problems : గొంతు సమస్యలు ఉంటే సహజంగానే ఎవరికైనా సరే ఆహారం తినేటప్పుడు, నీరు తాగేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మింగడం కష్టతరమవుతుంటుంది. జలుబు కారణంగా గొంతులో వాపు వచ్చినప్పుడు ఇలా అవుతుంది. దీంతో ఏ పదార్థాన్ని తిన్నా ఇబ్బందిగానే ఉంటుంది. అయితే ఈ సమస్య ఉన్నవారు వేడిగా ఉండే పదార్థాలను తింటే కొంత వరకు ఉపశమనం లభిస్తుంది. అలాగే ఈ సమస్య ఉన్నవారు తినకూడని ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
* గొంతు సమస్యలు ఉన్న వారు సిట్రస్ ఫలాలను తినరాదు. నిమ్మ, నారింజ, కివీలు, పైనాపిల్ వంటి పండ్లను తినకూడదు. తింటే గొంతులో ఇర్రిటేషన్ కలుగుతుంది. దీంతో సమస్య మరింత ఎక్కువవుతుంది.
* గొంతు సమస్యలు ఉంటే టమాటాలను కూడా తీసుకోకూడదు. టమాటాలు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి సమస్య తీవ్రతను పెంచుతాయి.
* చింత పండులో ఉండే పుల్లదనం గొంతు సమస్యను మరింత పెంచుతుంది. వాపును కలిగిస్తుంది. దురద వస్తుంది. అందువల్ల దీన్ని కూడా మానేయాలి.
* పచ్చళ్లు, చాట్ మసాలా వంటి పదార్థాలను కూడా గొంతు సమస్యలు ఉన్నవారు తినకూడదు.
* గొంతు సమస్యలు ఉన్నప్పుడు శరీర రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలను తినాలి. నూనె పదార్థాలు, వేపుళ్లను తింటే రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అందువల్ల ఈ పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి.
* సాధారణ సమయాల్లో పెరుగును తినవచ్చు. మంచిదే. కానీ గొంతు సమస్యలు ఉన్నవారు తింటే శరీరంలో శ్లేష్మం ఎక్కువవుతుంది. దీంతో సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. కనుక పెరుగును కూడా తినరాదు.
* బ్రెడ్, చిప్స్ వంటి పదార్థాలతోపాటు మద్యం సేవించడం మానేయాలి. అలాగే కెఫీన్ ఉండే టీ, కాఫీలను తాగరాదు. దీని వల్ల గొంతు పొడిగా మారి సమస్య ఎక్కువవుతుంది. వీటితోపాటు కూల్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ జ్యూస్లను తాగడం కూడా మానేయాలి.
గొంతు సమస్యలు ఉన్నప్పుడు ఈ పదార్థాలను తినడం మానేయడం వల్ల ఆయా సమస్యలు త్వరగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.