Mangoes : వేసవి మనకు ఎక్కువగా దొరికే పండ్ల లో ఒకటి మామిడి పండు కూడా. అయితే ఇవి మార్కెట్లలో ఎంతో విపరీతంగా అమ్ముడు పోతాయి. అయినా కానీ మామిడి పండ్లను బండ్లపై చూడగానే మామిడి ప్రియులు ఎగబడి కొంటూ ఉంటారు. కానీ దానిలో అసలు ఏవి నకిలీవి, ఏవి మంచివి అనేది అస్సలు పట్టించుకోరు. అదేమిటి అంటే. అసలు మామిడి పండ్లలో నకిలీవి కూడా ఉంటాయా అనే సందేహం కలుగుతుంది కదూ. అవును మీరు వెన్నది నిజమే. మార్కెట్లోకి చాలా నకిలీ మామిడి పండ్లు వస్తున్నాయి. ఈ నకిలీ మామిడి పండ్లు తిన్నవారు ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగేలా చేస్తుంది. దీనికి సంబంధించి తమిళనాడులో ఒక షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని ఆహార భద్రత విభాగం ఒక గిడ్డంగి నుండి నకిలీ మామిడి పండ్లను స్వాధీనం చేసుకున్నారు. సుమారుగా ఏడున్నర టన్నుల నకిలీ మామిడి పండ్లను సీజ్ చేసినటువంటి అధికారులు ఈ పండ్లను తీసుకుంటే ప్రజలు ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది అని తెలిపారు…
నకిలీ మామిడి పండ్లు అనగానే అవి యంత్రాల ద్వారా తయారు అవుతాయి అని అనుకోవద్దు. దాని అర్థం వేరే ఉంటుంది. ఈ మామిడి పండ్లను చెట్ల నుండి కోసి వాటిని కృత్రిమంగా తొందరగా పండించి మార్కెట్ కు తరలిస్తారు. అందువల్ల వీటిని నకిలీ మామిడి పండ్లు అని పిలుస్తారు. అయితే ఈ నకిలీ మామిడి పండ్లను పండించేందుకు కాల్షియం కార్బైడ్ లాంటి వాటిని వాడతారు. అయితే దాని ఉపయోగం అనేది పూర్తిగా నిషేధించారు. ఎందుకు అంటే. వాటి ఆధారంగా పండిన మామిడి పండ్లు మానవ శరీరానికి చాలా ప్రమాదకరం. ఎవరైనా కాల్షియం కార్బైడ్ తో మక్క బెట్టినటువంటి మామిడి పండ్లను తింటే వారి ఆరోగ్యానికి చాలా ప్రమాదం అని నిపుణులు తెలిపారు…
కాల్షియం కార్బైడ్ అనేది మార్కెట్లో తొందరగా దొరుకుతుంది. ఇది ఒక రకమైన రాయి లా ఉంటుంది. అందుకే దీనిని ప్రజలు సున్నపురాయి అని కూడా పిలుస్తూ ఉంటారు. కాల్షియం కార్బెడ్ తో మామిడి పండ్లను పండించేందుకు కార్బైడ్ ను పచ్చ మామిడికాయల మధ్యపెడతారు.అలాగే మామిడికాయల బుట్టలో కాల్షియం కార్బైడ్ చుట్టూ ఈ మామిడి కాయలను ఉంచుతారు. దాని తరువాత వాటిని గోనె సంచులతో కప్పుతారు. అలా ఈ మామిడి పండ్లను మూడు, నాలుగు రోజులు గాలిలేని ప్రదేశంలో ఉంచుతారు. దీని కారణం వలన అవి తొందరగా పండుతాయి. కాల్షియం కార్బైడ్ ను తేమతో సంబంధం లేకుండా ఎసిటిలిన్ అనే వాయువు ఏర్పడుతుంది. ఏ రకమైన పండ్లు అయిన వీటితో ఈజీగా పండుతాయి. ఇలా కాల్షియం కార్బైడ్ తో పండిన మామిడి పండ్లను తీసుకోవడం వలన ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతారు. వీటిని తీసుకోవడం వలన కడుపు నొప్పి లాంటి సమస్యలు అనగా విరోచనాలు, వాంతులు, లాంటి సమస్యలు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. ఇవి మాత్రమే కాక తలనొప్పి,మానసిక ఆందోళన, తల తిరగటం, ముర్చ లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి……
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.