
Kidney problems can be checked with these 5 food habits
Kidney Problems : ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవనశైలి లో కొన్ని ఆహారపు అలవాట్లు మారడంతో ఎన్నో రకాల వ్యాధులు వ్యాపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శరీర అవయవాలు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. అలాంటి అవయవాలలో కిడ్నీలు కూడా ఉంటాయి. శరీరంలోని ప్రధానమైన అవయవ భాగాలలో మూత్రపిండాలు కూడా ముఖ్యమైనవి. మూత్రపిండాలు పనితీరులో చిన్న మార్పులు కూడా ప్రమాదకర వ్యాధులకు కారణమవుతాయి. మూత్ర పిండాలు మూత్రం ద్వారా శరీరంలోని వ్యర్ధపదార్థాలను బయటికి పంపించడానికి సహాయపడతాయి. ఇది మంచి ఆరోగ్యం కోసం మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. కావున కిడ్నీలు మొత్తం శరీరంపై చెడు ప్రభావాన్ని చూపకుండా చేస్తుంటాయి. అయితే మూత్రపిండాలలో ఏదైనా సమస్య వస్తే వెంటనే కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి.
Kidney problems can be checked with these 5 food habits
లేకపోతే పెను ప్రమాదం ఎదురవుతుంది అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. అయితే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం.. *నీరస పడిపోవడం: చాలామంది అనారోగ్యంగా ఉన్నప్పుడు కూర్చోని విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. మూత్రపిండాల సమస్య ఉన్నప్పుడు శరీరం చురుగ్గా ఉండటం చాలా ప్రధానమని నిపుణులు తెలుపుతున్నారు. ఈ మూత్రపిండాల సమస్య ఉంటే మీరు తేలికపాటి వ్యాయామం లేదా యోగా చేయాలని దీని వలన శరీరం చురుకుగా తయారవుతుందని చెప్తున్నారు. *నీరు తక్కువగా తీసుకోవడం: మూత్రపిండాలు శుభ్రం అవ్వాలంటే నీటిని పుష్కలంగా తాగడం చాలా ప్రధానం. నీరు అధికంగా తీసుకోవడం వలన కిడ్నీలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోవు.. తక్కువ నీళ్లు తీసుకోవడం వల్ల కిడ్నీలలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోయి కిడ్నీలు దెబ్బతింటాయి. *పొటాషియం: కిడ్నీ వ్యాధిగ్రస్తులు పొటాషియం అధికంగా ఉండే వాటిని తీసుకోకూడదు.
మూత్రపిండా సమస్యలు ఉంటే బంగాళదుంపలు, బత్తాయి లాంటి వాటిని కూడా తినవద్దు. అవకాడో, అరటి పండ్లు తినడం కూడా కిడ్నీ వ్యాధిగ్రస్తులకి మంచిది కాదు. ఎందుకంటే వీటిలో పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది కిడ్నీలు దెబ్బతినేలా చేస్తాయి. *ఉప్పు ఎక్కువ తీసుకోవడం:
ఉప్పు ఆహారం రుచిని పెంచుతుంది. ఈ ఉప్పు లో సోడియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మూత్రపిండాలపై చెడు ప్రభావం చూపుతుంది. దాని వలన మీకు కిడ్నీ సంబంధిత సమస్య ఉంటే ఉప్పు అధికంగా వాడడం మానుకోవాలి. ఉప్పు తీసుకోవడం వలన గుండెపోటు రక్తపోటు లాంటి సమస్యలు ఎక్కువవుతూ ఉంటాయి. *నిద్ర: ఆరోగ్యంగా ఉండడానికి సరియైన నిద్ర చాలా ముఖ్యం. కానీ కిడ్నీ రోగులు పగటివేల ఎక్కువసేపు నిద్రపోవడం అసలు మంచిది కాదు. ఎందుకంటే ఎక్కువసేపు నిద్రపోవడం వలన మూత్రపిండాల్లోకి మూత్రం ఎక్కువగా చేరుతుంది. దీనివల్ల కిడ్నీలు పాడవుతాయి. అందుకే సాధ్యమైనంత వరకు రాత్రివేళలోనే నిద్రించాలి.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.