Childrens : తమ పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా ఆందోళన చెందుతూనే ఉంటారు. తన పిల్లలు ఎలా పెరుగుతారు..? వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది..? పెద్దయ్యాక ఏమవుతారు..? ఇలాంటి విషయాలలో పిల్లల చిన్నప్పటి నుండే తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ…వారి భవిష్యత్తు కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే పిల్లలకు అలవాటు చేసిన అలవాట్లు త్వరగా మారవు. అందుకే చిన్నతనం నుంచే తల్లిదండ్రులు పిల్లలకు మంచి విషయాలు నేర్పిస్తూ పెంచుతారు. అయితే పిల్లల పెంపకం పై శ్రద్ధ చూపకపోవడం వలన కొన్ని ముఖ్యమైన విషయాలను వారికి అర్థమయ్యేలా చెప్పకపోవడం వలన తల్లిదండ్రులు విఫలమవుతారని ఆచార్య చానక్యుడు తెలియజేశారు. ఇలాంటి పరిస్థితులలో తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటినుంచి కచ్చితంగా 3 విషయాలను నేర్పించాలని ఆచార్య చాణిక్యుడు తెలియజేయడం జరిగింది. ఈ విషయాలు పిల్లలకు నేర్పించడం వలన వారు జీవితంలో విజయం సాధించడమే కాక వారి భవిష్యత్తుకు వారే పునాది వేసుకుంటారని తెలియజేశారు. మరి ఆ 3 విషయాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
పిల్లలకు చిన్నతనం నుంచే ఈ విషయాన్ని తెలియజేస్తూ పెంచమని చానక్యుడు తెలిపాడు. ఎందుకంటే సత్యమార్గాన్ని అనుసరించే వారికి ఎప్పుడు చెడు జరగదు. అలాంటివారు వారి జీవితంలో అతి తక్కువ సమస్యలను ఎదుర్కొంటారు. వీరు ఎలాంటి అబద్ధాలు చెప్పకుండా నిజాలు మాట్లాడుతూ ఉంటారు. కనుక చిన్నప్పటి నుండే పిల్లలకు సత్యమార్గాన్ని అనుసరించేలా చేయాలని చాణిక్యుడు తెలిపారు. ఇలాంటివారు భవిష్యత్తులో మంచి సమర్ధులవుతారని చాణక్యుడు సూచించాడు.
ప్రతి ఒక్కరి జీవితంలో క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. ఇక చిన్నతనం నుంచే పిల్లలకు క్రమశిక్షణ నేర్పించడం వలన ప్రతిచోట వారు క్రమశిక్షణ పాటిస్తారు. దీంతో పాఠశాలలో కళాశాలలో మరియు ఆఫీసులో కూడా వీరికి క్రమశిక్షణ అలవాటు అవుతుంది. ఈ విధంగా క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవాటు చేయడం వలన వారి భవిష్యత్తులో ఎంతో ఎదుగుతారని ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొంటారని చాణక్యుడు తెలిపారు. అంతేకాక క్రమశిక్షణతో కలిగి ఉన్న వ్యక్తిని సమాజంలో గౌరవిస్తారు. కాబట్టి చిన్నతనం నుంచే పిల్లలను క్రమశిక్షణతో పెంచాలని ఆచార్య చాణక్యుడు తెలిపారు.
ఒక వ్యక్తి ఎలాంటివాడు అనే విషయాన్ని రూపం బట్టి కాకుండా అతని ప్రవర్తన బట్టి నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి పిల్లలకు చిన్నతనం నుండి మంచి విలువలను అలవాటు చేస్తూ తల్లిదండ్రులు పెంచడం వలన వారు ఎప్పటికీ ఎదుటివారిని కించపరిచేలా ప్రవర్తించరు. అంతేకాక విలువలతో పెరిగిన వ్యక్తి సమాజంలో ప్రతి ఒక్కరిని గౌరవిస్తాడు. అదేవిధంగా సమాజంలో గౌరవం లభిస్తుంది. దీంతో ఆ వ్యక్తి కుటుంబం కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. కాబట్టి తల్లితండ్రులు వారి పిల్లలకు చిన్నతనం నుండి మంచి విద్యను అందించడంతో పాటు మంచి విలువలను నేర్పించాలని చాణక్యుడు తెలిపారు. ఈ విధంగా చేయడం వలన పిల్లలు భవిష్యత్తులో సమాజం నుంచి మంచి గౌరవాన్ని పొందడంతో పాటు సమాజంలో అభివృద్ధి చెందుతాడు.
ఈ విధంగా ఈ మూడు విషయాలను చిన్నతనం నుంచే పిల్లలకు చెబుతూ పెంచడం వలన భవిష్యత్తులో వారు అన్ని విధాలుగా సమర్థులు అవుతారని చాణక్యుడు తెలిపాడు.
Durga Navaratri : అక్టోబర్ 3వ తేదీ నుండి నవరాత్రులు ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే శని దేవుడు…
Born : హిందూమతంలో చాలామంది జ్యోతిష్య శాస్త్రం తో పాటు న్యూమరాలజీని కూడా చాలా దృఢంగా నమ్ముతారు. ఇక ఈ…
RRB Recruitment : RRB టెక్నీషియన్ రిక్రూట్మెంట్ 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్ 2, 2024న పునఃప్రారంభించబడింది. టెక్నీషియన్ పోస్టులకు…
Konda Surekha : హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత దంపతులు విడిపోవడానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్…
Lymphoma : ప్రస్తుత కాలంలో ఎంతో మంది ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే రాత్రిపూట అధికంగా చెమటలు పట్టడం లేక…
Noni Fruit : మనం రోజు ఆరోగ్య కోసం ఎన్నో రకాల పండ్లను తింటూ ఉంటాం. అయితే ఈ పండ్లలో నోని…
Aloe Vera : అలోవెరా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే దీనిలో A, C, E విటమిన్స్ మరియు…
Breakfast : మన రోజు మొదలు బాగుంటే మన రోజంతా కూడా ఎంతో మంచిగా సాగుతుంది అని అంటారు. కానీ ప్రస్తుతం…
This website uses cookies.