
Drink Water : నిలబడి నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా... వెరీ డేంజర్...!
Drink Water : మన పూర్వీకులు ఆచారాల పేరుతో ఎన్నో రకాల ఆరోగ్య విషయాలను మనకు బోధించారు. భోజనం చేసే పద్ధతి నుండి నిద్రపోయే వరకు ఎన్నో రకాల పద్ధతులను మన పూర్వీకులు నుండి మనం నేర్చుకోవడం జరిగింది. ఇక వాటి వెనక కూడా ఎంతో సైన్స్ దాగి ఉంటుంది. మరి ముఖ్యంగా ఆరోగ్యం గురించి.. అయితే సాధారణంగా చాలామంది మంచినీళ్లు ఎలా పడితే అలా తాగుతుంటారు. 90 శాతం మంది మంచినీటిని తప్పుగానే తాగుతున్నారని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే నీటిని తాగేందుకు కూడా ఒక పద్ధతి ఉందని వారు సూచిస్తున్నారు. అయితే ఆయుర్వేదం ప్రకారం నీటిని భోజనానికి 30 నిమిషాల ముందు మరియు భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత తాగాలి. అప్పుడే మనం తిన్న ఆహారం నుండి పోషకాలు సక్రమంగా గ్రహించబడతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే తిన్న ఆహారం కూడా సక్రమంగా జీర్ణం అవుతుంది. కావున భోజనం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్లు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు.
ఒకవేళ అంతగా తాగాలి అనిపిస్తే మాత్రం కొద్దిగా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. అదేవిధంగా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే నీళ్లను తీసుకునేటప్పుడు నిలుచుని అస్సలు తాగకూడదట. నిలుచుని నీటిని తాగడం వలన జీర్ణ వ్యవస్థ పై నేరుగా ప్రభావం పడుతుంది. అది కిడ్నీలో పనితీరును దెబ్బతీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నీళ్లను ఎల్లప్పుడూ కూర్చునే తాగాలని పలువురు చెబుతున్నారు. అదేవిధంగా ఎల్లప్పుడూ గోరువెచ్చని నీళ్లు లేదా గది ఉష్ణోగ్రత వద్ద ఉండే నీటిని మాత్రమే తీసుకోవాలని చల్లని నీటిని తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. అయితే చల్లని నీటిని తాగాలి అనుకునేవారు కుండ లో నీటిని తాగటం మంచిదని ఫ్రిజ్ లో చల్లబరిచిన నీటిని అస్సలు తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు. ఫ్రిజ్ లో నీటిని తీసుకోవడం వలన శరీరంలో కఫం పెరిగిపోయి శ్వాసకోశ సమస్యలు వస్తాయి. అదేవిధంగా మలబద్ధకం వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అదేవిధంగా ఫ్రిజ్ లో కూర్చుని నీటిని తాగడం వలన ఆహారంలో ఉండే పోషకాలను కూడా శరీరం గ్రహించలేదన్నారు.అంతేకాక ఫ్రిజ్ లో చల్లబరిచిన నీటిని తాగడం వలన రక్తనాళాలు కూచించు కుపోతాయట. దీంతో గుండె సంబంధిత వ్యాధులు హార్ట్ ఎటాక్ వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చల్లటి నీటిని తాగకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా ప్రతిరోజు కనీసం 2 నుండి 3 లీటర్ల నీళ్లు తాగాలి. అలాగే నీటిని తాగే సమయంలో మధ్యమధ్య కొంత సమయం గ్యాప్ ఇచ్చి తాగాలి. ఎక్కువ మొత్తంలో నీటిని ఒకేసారి తాగడం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే అది జీర్ణాశయంపై ఒత్తిడి పెరిగేలా చేస్తుంది. కాబట్టి నీటిని కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తాగటం మంచిది. గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. ది తెలుగు న్యూస్ దీనిని ధృవీకరించలేదు.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.