Malkajgiri : మల్కాజ్‌గిరి కార్పొరేషన్‌లో ఘనంగా రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Malkajgiri : మల్కాజ్‌గిరి కార్పొరేషన్‌లో ఘనంగా రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం

 Authored By sudheer | The Telugu News | Updated on :18 March 2026,7:30 pm

ప్రధానాంశాలు:

  •  Malkajgiri : మల్కాజ్‌గిరి కార్పొరేషన్‌లో ఘనంగా రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం

Malkajgiri : మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున “రంజాన్ తోఫా” కిట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఘట్కేసర్ సర్కిల్‌లోని పోచారం డివిజన్ ప్రతాప్ సింగారం ప్రాంతంలో నిర్వహించిన ఈ కార్యక్రమం స్థానిక బిలాల్‌లో జరిగింది. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ , మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి , మాజీ జడ్పీ ఛైర్మన్ శరత్ చంద్ర రెడ్డి హాజరయ్యారు. వారు ముస్లిం సోదరులకు స్వయంగా తోఫా కిట్లను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

Ramzan Tofa distribution program in Malkajgiri

Malkajgiri : మల్కాజ్‌గిరి కార్పొరేషన్‌లో ఘనంగా రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం

ఈ సందర్భంగా తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ.. రంజాన్ నెలలో ఉపవాసం ఉండే ముస్లింలకు ఈ తోఫా కిట్లు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయం వారి రోజువారీ అవసరాలను కొంతవరకు తీర్చడంలో దోహదపడుతుందని చెప్పారు. పండుగలు మతసామరస్యానికి ప్రతీకలని, సమాజంలో సౌహార్దతను పెంపొందించేందుకు ఇవి కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. అందరూ కలిసికట్టుగా పండుగలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోచారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఘట్కేసర్ మండల్ అధ్యక్షులు కర్రే రాజేష్ స్థానిక నాయకులు,మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని మరింత ఉత్సాహంగా మార్చారు. సామాజిక ఐక్యతను ప్రతిబింబించే ఈ కార్యక్రమం ప్రాంతంలో సానుకూల సందేశాన్ని పంపింది. రంజాన్ పర్వదినం సందర్భంగా నిర్వహించిన ఈ తోఫా పంపిణీ ప్రజల మధ్య సోదరభావాన్ని మరింత బలోపేతం చేసింది.

 

Also read

sudheer

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది