Inspirational News : ఒకప్పుడు పాలు అమ్మిన వ్యక్తి ఇప్పుడు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మిస్తాడని ఎవ్వరైనా ఊహించారా? మనిషిలో పట్టుదల ఉంటే ఏదైనా చేసేయొచ్చు అని నిరూపించాడు ఆయన. ఒకప్పుడు పాలు అమ్మి కష్టం విలువ తెలిసిన ఆయన ఇప్పుడు రూ.800 కోట్లకు అధిపతి అయ్యాడు. ఆయన పేరే నారాయణ్ మజుందార్. వెస్ట్ బెంగాల్ కు చెందిన ఈయన ఒకప్పుడు పాలు అమ్మాడు. కానీ.. కష్టపడ్డాడు. కసి, పట్టుదలతో ముందుకు వెళ్లాడు. నిరంతరం శ్రమించాడు. ఇప్పుడు పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు నారాయణ్.
నదియా జిల్లాలోని ఓ మారు మూల పల్లె. ఊళ్లోనే ఉన్న పాఠశాలలో చదువు పూర్తి చేశాడు. ఎన్డీఆర్ఐలో పై చదువుల కోసం చేరాడు. కోర్సు ఫీజు కట్టేందుకు డబ్బులు లేక పార్ట్ టైమ్ గా ఉదయం 7 గంటల వరకు పాలు అమ్మేవాడు. పాలు అమ్మగా వచ్చిన డబ్బులతో కాలేజీ ఫీజు కట్టేవాడు. చదువు పూర్తయ్యాక.. కోల్ కతాలో ఓ ఐస్ క్రీమ్ కంపెనీలో పని చేయడం ప్రారంభించాడు. పలు డెయిరీ సంస్థలలో పని చేసిన తర్వాత 1999లో రూ.10 లక్షల పెట్టుబడితో శీతలీకరణ ప్లాంట్ ఏర్పాటు చేశాడు మజుందార్. ఆ తర్వాత కొన్నేళ్లకే రెడ్ కౌ డైరీని స్టార్ట్ చేశాడు.
కోల్ కతా డెయిరీతో పార్టనర్ షిప్ కుదుర్చుకొని అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు వెయ్యి మంది పని చేసేలా తన సంస్థను రూపొందించాడు. 12 జిల్లాల్లో 3 లక్షల మంది రైతుల దగ్గర నుంచి పాలు కొంటారు. ఇప్పుడు తన కంపెనీ విలువ రూ.800 కోట్లు. ప్రతి రోజు వీళ్ల కంపెనీ 4 లక్షల లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తుంది. 35 పాల శీతలీకరణ ప్లాంట్స్ ఉన్నాయి. 400 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. చదువుకునే రోజుల్లో కోర్సు ఫీజు కోసం సైకిల్ మీద పాలు అమ్మిన వ్యక్తి ఇప్పుడు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాడంటే మాములు విషయం కాదు. ఇదంతా ఆయనకు పూలపాన్పు కాదు. చాలా కష్టపడ్డాడు. ఎంతో చెమటోడ్చి ఈ స్థాయికి చేరుకున్నాడు.
Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…
Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…
Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…
TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…
Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…
Honey Moon : మధ్యప్రదేశ్ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…
This website uses cookies.