
plantation a teacher planted 30000 plants
Plantation Bahubali : మనం జీవితం మొత్తం మీద ఎన్ని మొక్కలు నాటి ఉంటాం?. మహా అయితే ఐదో పదో. కానీ ఈయన ఇప్పటి వరకు ఏకంగా 30 వేలకు పైగా మొక్కలు నాటాడు. పువ్వు పుట్టగానే పరిమళించింది అంటారు కదా. దానికి చక్కని ఉదాహరణగా నిలిచాడు. ఈయన పేరు అంతర్యామి సాహు. వయసు 75 ఏళ్లు. ఒడిశా రాష్ట్రానికి చెందినవాడు. 11 ఏళ్ల ప్రాయంలోనే మొక్కలు నాటడం మొదలు పెట్టాడు. 64 ఏళ్లుగా ఆ పనిని కొనసాగిస్తున్నాడు. టీచర్ గా పనిచేస్తూ పిల్లల చేత కూడా మొక్కలు నాటించేవాడు. తద్వారా ఒడిశా రాష్ట్ర వ్యాప్తంగా ‘‘ట్రీ టీచర్’’ అనే గొప్ప పేరు సంపాదించుకున్నాడు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు పొందాడు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతూ పది మందికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ప్రజల ప్రశంసలను అందుకుంటున్నాడు.
plantation a teacher planted 30000 plants
పర్యావరణాన్ని పరిరక్షించాలంటే మొక్కలు మాత్రమే నాటితే చాలదని అంతర్యామి సాహు అంటున్నాడు. అడవులను, వాటిలోని జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నాడు. అడవులు అగ్నికి ఆహుతి కాకుండా కంటికి రెప్పలా కాచుకోవాలని, అడవుల్లోని వివిధ జంతువులు ఆ మంటల్లో కాలి బూడిదవకుండా రక్షించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఈ విషయాలనే సచిత్రంగా చాటుతున్నాడు.స్వయంగా బొమ్మలు గీచి ఆయా పోస్టర్లను బహిరంగ ప్రదేశాల్లో అంటిస్తూ ప్రజల్లో అవగాహన పెంచుతున్నాడు. ప్రకృతిలో ప్రతి జీవీ ఒకదానిపై ఒకటి ఆధారపడి బతుకున్న వైనాన్ని అక్షరమ్ముక్కరానివారికి కూడా అంతర్యామి సాహు అర్థమయ్యేలా వివరించాడు. సోషల్ మీడియా లేని రోజుల్లో ఎంతో శ్రమకోర్చి ఈ ప్రచార పత్రికలను తయారుచేసేవాడు.
plantation a teacher planted 30000 plants
రీసెంటుగా సామాజిక మాధ్యమంలోనూ ఖాతా తెరిచి డిజిటల్ గా సైతం తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నాడు. వందలు, వేల సంఖ్యలో లైకులు, షేర్లు, కామెంట్లు పొందుతున్నానని, దీన్నిబట్టి తనను ఎంత మంది ఫాలో అవుతున్నారో అర్థమవుతోందని అంటున్నాడు.
plantation a teacher planted 30000 plants
అంతర్యామి సాహు మొత్తానికి అనుకున్నది సాధించాడు. తన ప్రయత్నాల వల్ల 2001-08 మధ్య కాలంలో ఒడిశాలో అటవీ దహనాల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గాయని పేర్కొన్నాడు. ఎక్కడెక్కడ అటవీ దహనాలు ఎక్కువగా జరుగుతున్నాయో ఆయా హాట్ స్పాట్లను గుర్తించి ప్రభుత్వానికి చెప్పేవాడు. సర్కారుతోపాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో జిల్లా వ్యాప్తంగా నాలుగు బయో డైవర్సిటీ పార్కులను నెలకొల్పాడు. గడచిన ఐదు దశాబ్దాల కాలంలో తాను చేసిన పనిని చూసి దాదాపు 30 వేల మంది ప్రభావితమయ్యారని అంతర్యామి సాహు ఆనందం వెలిబుచ్చారు. అంతర్యామి చేస్తున్న కృషికి లోకల్ మీడియా సైతం బాగా ప్రచారం కల్పిస్తోంది. తనకు మరో నలుగురు తోడైతే ఈ కార్యక్రమం మరింత విజయవంతమవుతుందని కోరుకుంటున్నాడు.
New Changes : భారతదేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏప్రిల్ 1, 2026 నుంచి పలు…
Gold Silver Rate 30 March 2026 : భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
Karthika Deepam 2 March 30th 2026 Episode : స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతూ, తెలుగు బుల్లితెర…
Cold Water : వేసవి కాలంలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి మనం చేసే మొదటి పని ఫ్రిజ్లోని…
Peanuts : పేదవాడి బాదంగా పిలువబడే వేరుశెనగ పప్పులు కేవలం రుచికరమైన చిరుతిండి మాత్రమే కాదు, ఇవి గుండె ఆరోగ్యానికి…
Vastu Plants : మన నివాస స్థలంలో ఉండే శక్తి మన జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వాస్తు శాస్త్రం…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఓటు షేర్ అంశం హాట్ టాపిక్గా మారింది. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని…
Tomahawk : అమెరికా రక్షణ రంగంలో తోమహాక్ క్షిపణులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దశాబ్దాలుగా శత్రువుల గుండెల్లో నిద్రపోతున్న…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.…
Raghava Mining : తెలంగాణ శాసనసభ వేదికగా రాఘవ మైనింగ్స్ వ్యవహారం ఒక పెద్ద రాజకీయ దుమారాన్నే రేపింది. సభలో…
Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం ఎప్పుడూ ఒక హాట్ టాపిక్ గానే ఉంటోంది. తాజాగా అసెంబ్లీలో అమరావతిని ఏకైక…
New COVID Variant : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కొత్త వేరియంట్ 'BA.3.2' 'సికాడా' వేరియంట్ వార్తలు ప్రజల్లో…
This website uses cookies.