AP Fisheries Dept : మ‌త్య్స శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్… అన్ని జిల్లాల వారు అర్హులే… ఇలా అప్లై చేయండి…!

 Authored By ramu | The Telugu News | Updated on :20 April 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  AP Fisheries Dept : మ‌త్య్స శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్... అన్ని జిల్లాల వారు అర్హులే... ఇలా అప్లై చేయండి...!

AP Fisheries Dept  : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారికి ప్రభుత్వం అద్భుతమైన నోటిఫికేషన్ తో మన ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ మ‌త్య్స శాఖల ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇప్పుడు విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు…
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసుకున్న పోస్టులు ఏమిటి.? ఉండవలసిన అర్హతలు ఏమిటి? ఎలా అప్లై చేయాలి.? ఎంపిక విధానం ఎలా ఉంటుంది.. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పే స్కేల్ ఎలా ఉంటుంది. లాంటి ప్రధానమైన వివరాలను తెలుసుకొని అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోవచ్చు..

AP Fisheries Dept  : అర్హతలు

పిషిరిస్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
-అప్లికేషన్ ప్రారంభ తేదీ 23/04/ 2024..
-అప్లికేషన్ లాస్ట్ తేదీ 13/ 05/ 2024…
-హాల్ టికెట్స్ విడుదల తేదీ అధికారిక వెబ్సైట్లో తరువాత వస్తుంది…
-పరీక్ష తేదీ అధికారిక వెబ్సైట్లో ఉంటుంది..
-జీతము 45,830 రూపాయలు…
-గరిష్ట వయసు 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాలు ఉండాలి..
-వయసు సడలింపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. దివ్యాంగులైన అయిన అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడేలింపు ఉంటుంది.

ఫీజు…ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు 250 మిగతా వారికి 350 ఫీజు చెల్లించవలసి ఉంటుంది…
-ఎంపిక విధానం ఈ పోస్టులు ఎంపికల్లో పరీక్ష మరియు కంప్యూటర్ టెస్ట్ నిర్వహించి వాటి ఆధారంగా ఎంపిక చేస్తారు..

AP Fisheries Dept : మ‌త్య్స శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్... అన్ని జిల్లాల వారు అర్హులే... ఇలా అప్లై చేయండి...!

AP Fisheries Dept : మ‌త్య్స శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్… అన్ని జిల్లాల వారు అర్హులే… ఇలా అప్లై చేయండి…!

-ఈ పరీక్షలు మూడు పేపర్లు ఉంటాయి. పేపర్ వన్ లో 150 ప్రశ్నలు.. 150 మార్కులు ఇస్తారు.. ఇందులో జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ నుండి ప్రశ్నలు వస్తాయి..
-పేపర్ 2 లో 150 ప్రశ్నలు 150 మార్కులు ఇస్తారు. ఈ పేపర్లో ఫిషరీస్ సైన్స్ నుండి ప్రశ్నలు వస్తాయి..
-పేపర్ 3 లో 150 ప్రశ్నలు 150 మార్కులు వస్తాయి. ఈ పేపర్లో కూడా ఫిషరీస్ సైన్స్ నుండి ప్రశ్నలు ఇస్తారు..
-మూడు పేపర్లు కలిపి 450 మార్కులు ఇస్తారు. ప్రతి తప్పు సమాధానికి వన్ బై త్రీ వంతు రుణాత్మక మార్కుల విధానంలో అమలు చేయబడుతుంది..
-కంప్యూటర్ ప్రొపొషియల్ టెస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది.. అందులో వచ్చిన మార్కులు ఫైనల్ సెలక్షన్లో పరిగణలోకి తీసుకుంటారు..
-నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్..
-భర్తీ చేసిన పోస్టులు ఆంధ్రప్రదేశ్ మ‌త్య్స శాఖలో ఫిష్ షరీష్ డెవలప్మెంట్ ఆఫీసర్..
-మొత్తం పోస్టుల సంఖ్య నాలుగు…

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి