
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 12న కడప ప్రెస్ క్లబ్లో జిల్లా సదస్సు నిర్వహించనున్నట్లు అఖిల పక్ష రైతు సంఘాల జిల్లా కార్యదర్శులు దస్తగిరి రెడ్డి, గాలి చంద్ర, రైతు స్వరాజ్య వేదిక జిల్లా కన్వీనర్ మేకల జయన్న, శివారెడ్డి శనివారం తెలిపారు.తొమ్మిది నెలలుగా ఢిల్లీలో రైతన్నలు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వ్యవసాయ చట్టాలను వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముగాస్తున్నదని ఆరోపించారు. ఇకపోతే మోడీ ప్రభుత్వం సామాన్యుడి నడ్డీని విరుస్తున్నదని విమర్శించారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు ఇటీవల బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే సామాన్య ప్రజానీకం నుంచి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నెల 12న నిర్వహించనున్న సదస్సులో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నాయకులు, నిపుణులు వివరించనున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ఇప్పటికే విపక్ష పార్టీలు పలు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి.
Garlic | చలికాలం వచ్చేసింది అంటే చలి, దగ్గు, జలుబు, అలసటలతో చాలా మందికి ఇబ్బందులు మొదలవుతాయి. ఈ సమయంలో…
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
This website uses cookies.