అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్ స్టేట్ తెలంగాణ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ పట్టణంలోని మూడో డివిజన్లో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ.12 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు పనులకు మంత్రి కమలాకర్ భూమి పూజ చేశారు. కొబ్బరి కాయ కొట్టి, గడ్డపారతో భూమిని తవ్వి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ సర్కారు అహర్నిశలు పని చేస్తున్నదని మంత్రి గంగుల చెప్పారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. అభివృద్ధి పథంలో తెలంగాణ దూసుకుపోతున్నదని చెప్పారు. అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. అన్ని వర్గాల అభివృద్ధికి టీఆర్ఎస్ సర్కారు పాటు పడుతుందని తెలిపారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో కరీంనగర్ పట్టణ మేయర్ వై.సునీల్రావు, కమిషనర్ గరిమ అగర్వాల్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
This website uses cookies.