కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతాంగానికి సంపూర్ణంగా వ్యతిరేకమైన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని అఖిల పక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లాలోని ఖమ్మం రూరల్ మండలం కేంద్రంలో అఖిల పక్ష పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సీపీఐ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో సీపీఐ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, ఎంపీటీసీ కళ్లెం వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం రైతాంగ వ్యతిరేక చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు.
ఈ నెల 27న జరిగే భారత్ బంద్ను జయప్రదం చేయాలని కోరారు. సీపీఐ నాయకులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు లాభం చేకూరుస్తూ సామాన్యుడి నడ్డీ విరుస్తున్నదని విమర్శించారు. డీజిల్, పెట్రోల్ ధరలతో పాటు గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ ప్రజలను ఇంకా ఇబ్బందుల పాలు చేస్తున్నదని ఆరోపించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రజలు ఆర్థికంగా బాగా నష్టపోయారని, ఈ క్రమంలోనే ప్రజలపై కేంద్రం అదనపు భారం వేస్తున్నదని విమర్శించారు.
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
This website uses cookies.