జిల్లాలోని కిన్నెరసాని ప్రాజెక్టు జలకళ సంతరించుకున్నది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నవానలకుగాను ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరుతున్నది. కిన్నెరసాని డ్యాం సామర్థ్యం 407 అడుగులు కాగా 405 అడుగులకు నీటిమట్టం చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇంకా నీరు బాగానే వస్తున్నట్లు పేర్కొన్నారు. ఇకపోతే డ్యాం నుంచి నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఇప్పటికే ఇరవై ఆరు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు ఆఫీసర్లు తెలిపారు.
ఇకపోతే లోతట్టు ప్రాంతాల్లో జనాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. వాగులు, వంకలతో పాటు ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారిపోతున్నాయి. జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాల్లో అధికారులు ప్రజలకు సాయం చేసేందుకుగాను పలు చర్యలు తీసుకుంటున్నారు. భారీ వర్షాలకు పంట నష్టం జరిగే చాన్సెస్ ఉన్నాయి. ఇకపోతే ఈ వానల సమయంలో రైతుల కరెంటు మోటార్లు, విద్యుత్ స్తంభాలను ముట్టుకోవద్దని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
This website uses cookies.