జిల్లాలోని కిన్నెరసాని ప్రాజెక్టు జలకళ సంతరించుకున్నది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నవానలకుగాను ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరుతున్నది. కిన్నెరసాని డ్యాం సామర్థ్యం 407 అడుగులు కాగా 405 అడుగులకు నీటిమట్టం చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇంకా నీరు బాగానే వస్తున్నట్లు పేర్కొన్నారు. ఇకపోతే డ్యాం నుంచి నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఇప్పటికే ఇరవై ఆరు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు ఆఫీసర్లు తెలిపారు.
ఇకపోతే లోతట్టు ప్రాంతాల్లో జనాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. వాగులు, వంకలతో పాటు ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారిపోతున్నాయి. జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాల్లో అధికారులు ప్రజలకు సాయం చేసేందుకుగాను పలు చర్యలు తీసుకుంటున్నారు. భారీ వర్షాలకు పంట నష్టం జరిగే చాన్సెస్ ఉన్నాయి. ఇకపోతే ఈ వానల సమయంలో రైతుల కరెంటు మోటార్లు, విద్యుత్ స్తంభాలను ముట్టుకోవద్దని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…
Etela Rajender : కాళేశ్వరం ప్రాజెక్ట్పై జరుగుతున్న కమిషన్ విచారణలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.…
Telangana Cabinet Expansion : ఎన్నాళ్లుగానో వేచి చూస్తు మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకి సాకారం అయింది.. కొత్తగా మంత్రివర్గంలో ముగ్గురు…
Today Gold Price : ప్రస్తుతం బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. జూన్ 8వ తేదీ ఆదివారం నాటి…
Vastu Tips : భోజనం చేసే దిశ కూడా వాస్తు శాస్త్రంలో ఏ దిశ మంచిదో తెలియజేయడం జరిగింది. సరైన…
Health Benefits Vitamin F : మనము ఇప్పటివరకు విటమిన్లలో ఎ, బి, బి 1, బి 2, బి…
Ajwain Leaves : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జింక్ ఫుడ్ ని అలవాటు చేసుకుంటున్నారు. దీని వల్ల…
Seem Chintakaya : సీమ చింతకాయ, దీని గురించి ఇప్పటి ప్రజలకు అసలు తెలియదు. పల్లెల్లో హేమ చింతకాయ గురించి…
This website uses cookies.