టీఆర్ఎస్ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలతో తెలంగాణ ప్రజలు విసుగు చెంది ఉన్నారని కాంగ్రెస్ పార్టీ గజ్వెల్ పట్టణ కమిటీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి తెలిపారు. ఈ నెల 17న గజ్వెల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే ‘దళిత గిరిజన దండోరా సభ’ను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలకు సోమవారం పిలుపునిచ్చారు. నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశమై సభను సక్సెస్ చేయాలని కోరారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దళితులు, గిరిజనులను టీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తున్నదని విమర్శించారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానని చెప్పి కేసీఆర్ ఆ మాట మరిచిపోయారని, దళితులకు మూడెకరాల భూమి హామీ అమలుకు నోచుకోలేదని వివరించారు. నియామకాల కోసం ఏర్పడ్డ తెలంగాణలో నిరుద్యోగులు ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారని చెప్పారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా తెలంగాణ సర్కారు కాలయాపన చేస్తున్నదని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
This website uses cookies.