Home » National » Central Govt Employees To Get 3 To 4 Percent Da Hike In July 2023
National

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మళ్లీ పెరగనున్న డీఏ.. భారీగా పెరగనున్న జీతాలు

Authored By
Breaking News 2
The Telugu News | Published on: June 12, 2023, 9:00 pm
Advertisement

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్. త్వరలోనే వాళ్లకు మళ్లీ జీతం పెరగనుంది. అంటే మళ్లీ డీఏ పెరగనుందన్నమాట. అవును.. గత మార్చిలోనే వాళ్లకు డీఏ పెరిగిన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ డీఏను పెంచబోతున్నారట. డీఏ పెంపు విషయంపై త్వరలోనే అప్ డేట్ రానుంది. వచ్చే నెల జులైలోనే వాళ్లకు డీఏ పెరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి సంవత్సరానికి రెండు సార్లు డీఏను పెంచాలి. ఇప్పటికే గత మార్చిలో పెరిగింది. ఇప్పుడు జులైలో పెంచబోతున్నారు. 3 నుంచి 4 శాతం వరకు డీఏ పెరిగే చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. 3 నుంచి 4 శాతం డీఏ పెరిగితే ఖచ్చితంగా జీతాలు భారీగా పెరగనున్నాయి.

Advertisement

గత మార్చిలో పెరిగిన డీఏ ప్రకారం చూసుకుంటే జనవరి 1, 2023 నుంచి పెరిగిన జీతాలు అమలులోకి వచ్చాయి. మార్చి 2023 లో డీఏ 38 శాతం నుంచి 42 శాతానికి పెరిగింది. అంటే 4 శాతం డీఏ పెరిగింది. మరో 4 శాతం పెరిగితే.. డీఏ 46 శాతం కానుంది. 46 శాతం డీఏ పెరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఒక్కసారిగా పెరగనున్నాయి.డీఏ, డీఆర్ రెండు పెరిగితే.. 47.58 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 69.76 లక్షల పెన్షనర్లకు లబ్ది చేకూరనుంది. ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ పే ఆధారంగా డీఏ పెరుగుతుంది.

7th Pay Commission how much da to be hiked for govt employees

Advertisement

7th Pay Commission : డీఏ, డీఆర్ పెరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే

బేసిక్ పెన్షన్ ఆధారంగా డీఆర్ ను అందిస్తారు. ఇక.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆయా రాష్ట్రాల నిబంధనల ప్రకారం డీఏను పెంచుతారు. ఇటీవల జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు తమ జీతాలను పెంచాయి. ఒక ప్రభుత్వ ఉద్యోగి నెట్ జీతం రూ.42 వేలు అయితే అందులో బేసిక్ పే రూ.25,500 ఉంటుంది. అందులో రూ.9690 డీఏ వస్తుంది. మరో 4 శాతం డీఏ పెరిగితే.. డీఏ పెంపు తర్వాత డీఏ రూ.10,710 గా ఉంటుంది. అంటే నెలకు రూ.1020 జీతం పెరుగుతుంది అన్నమాట.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి