
india vs pak
india-pakistan : ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న విభేదాల గురించి అందరికి తెలిసిందే, నిత్యం ఇరు దేశాల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. అలాంటి దేశాల మధ్య జరిగిన జిజిఎం భేటీలో సరికొత్త ప్రకటన వచ్చింది. ఉరుములు పిడుగులు లేకుండా వచ్చిన ఈ వార్త పట్ల ఇరు దేశాల జనాభాతో పాటుగా ప్రపంచ దేశాలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
ఉప్పు నిప్పుగా ఉంటున్న భారత్ పాకిస్తాన్ దేశాలు ఎవరు ఊహించని విధంగా శాంతి బాట పట్టాయి. పరస్పరం సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు చర్చలకు శ్రీకారం చుట్టాయి. నియంత్రణ రేఖ ఎల్ఓసీ గుండా కాల్పుల విరమణతో సహా వివిధ అంశాలపై గతంలో ఉన్న నిబంధలను కఠినంగా అమలు చేయాలనీ ఇరు దేశాలు నిర్ణయించాయి. తాజాగా జరిగిన సమావేశంలో ఇరు దేశాలు కలిసి ఉమ్మడి ప్రకటన విడుదల చేయటం అంతర్జాతీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇక చైనా విషయానికి వస్తే నిన్న మొన్నటి దాక యుద్దానికి సిద్ధమంటూ సంకేతాలు ఇచ్చిన డ్రాగన్ దేశం ఇప్పుడు శాంతి మంత్రం వల్లిస్తుంది. సరిహద్దులో ఎక్కువగా మోహరించి ఉన్న తమ సైన్యాన్ని వెనక్కి పిలిపించుకుంటామని చైనా రక్షణ మంత్రి ప్రకటించటం జరిగింది. పైగా ఇండియాలో జరిగే బ్రిక్ సదస్సుకు తమ పూర్తి స్థాయి మద్దతు ఉంటుందని చైనా ఇప్పటికే ప్రకటించింది. ఇటు పక్క ఏమో శాంతి చర్చలకు మేము సిద్దమే అంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించాడు.. ఇండియా అంటే ఒంటి కాలు మీద లేచే ఈ రెండు దేశాలు ఉన్నట్లు వుంది. ఇప్పుడు శాంతి చర్చలు అంటూ ముందుకు రావటం ఏంటి..? అసలు తెర వెనుక ఏమి జరిగింది అనేది ఎవరికీ అర్ధం కానీ విషయం.
అయితే ఈ రెండు దేశాల మాటలు నమ్మటానికి లేదు. చేసుకున్న ఒప్పందాలను పాటించకుండా ఉల్లంఘించట అనేది పాకిస్తాన్ కు ఉన్న అలవాటు, ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇప్పటికి దాదాపు 10 వేల సార్లు పాక్ ఉల్లఘించటం జరిగింది. మరో పక్క చైనా కూడా ఒక పక్క శాంతి అంటుంటే మరోపక్క యుద్దానికి చేయటానికి సిద్దమైయే రకం.
అయితే ఈ సారి పాకిస్తాన్ శాంతి చర్చలు అంటూ ముందుకు రావటం గతంలో చేసుకున్న ఒప్పందాలను కఠినంగా అమలుచేయాలని నిర్ణయం తీసుకోవటం వెనుక భారత్ జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ ఉన్నట్లు సమాచారం. ఈయనే గత కొద్దీ కాలంగా పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రితో వరస సమావేశాలు నిర్వహిస్తూ దానికి సంబంధించిన సమాచారం రక్షణ శాఖ మంత్రి రాజనాధ్ సింగ్ కు అందిస్తున్నట్లు తెలుస్తుంది. దోవల్ జరిపిన చర్చల ఫలితంగానే పాకిస్తాన్ ఇప్పుడు శాంతి చర్చలు జరిపినట్లు తెలుస్తుంది.
Petrol : భారత్లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
This website uses cookies.